Viral Video : ప్రస్తుత తరుణంలో దేశంలో ఎక్కడ చూసినా యువత.. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులతోపాటు సంబంధిత శాఖలకు చెందిన అధికారులు, ప్రభుత్వాలు డ్రగ్స్ పట్ల ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి సరఫరా ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్లోని ఓ పబ్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం.. ఇందులో పలువురు ప్రముఖుల పిల్లలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే డ్రగ్స్కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఆ ప్రముఖులు ఎలా కట్టడి చేస్తున్నారో తెలియదు కానీ.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన తల్లి మాత్రం గంజాయికి అలవాటు పడ్డ తన కుమారుడిని సరైన దారిలోకి తెచ్చేందుకు వినూత్న పద్ధతిని అవలంబించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి అలవాటు పడ్డ తన 15 ఏళ్ల కుమారుడికి ఓ తల్లి చాలా కఠినమైన శిక్ష విధించింది. మరో మహిళ సహాయంతో తన కుమారున్ని పట్టుకుని చేతులు కట్టిపెట్టి అతని కళ్లపై కారం పూసింది. దీంతో ఆ బాధకు తట్టుకోలేక ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. నీళ్లు ఇవ్వమని బతిమాలుతూ తీవ్రంగా దుఃఖించాడు. అయితే అతని బాధను ఆ తల్లి పట్టించుకోలేదు. నీళ్లు ఇవ్వాలంటే గంజాయి మానేస్తానని చెప్పి ఒట్టు వేయాలని ఆమె అడిగింది. దీంతో అందుకు ఒప్పుకున్న అతను అలాగే చేస్తానని.. గంజాయిని ఇకపై ముట్టుకోనని తెలిపాడు. ఈ క్రమంలో అతనికి తన తల్లి నీళ్లు ఇచ్చింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాగా ఆ తల్లి చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. డ్రగ్స్కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఇలా కఠినంగా శిక్షిస్తేనే కానీ వారిలో మార్పు రాదని.. ఆ తల్లి ఇలా చేసినందుకు ఆమెకు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం.. మరీ ఇంత కఠినంగా ప్రవర్తించవద్దని.. పిల్లలు డ్రగ్స్ లేదా గంజాయిని మానేసేలా ఇంకా వేరే ఏదైనా మార్గాన్ని అనుసరించాలని.. సూచిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…