Viral Video : ప్రస్తుత తరుణంలో దేశంలో ఎక్కడ చూసినా యువత.. ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులతోపాటు సంబంధిత శాఖలకు చెందిన అధికారులు, ప్రభుత్వాలు డ్రగ్స్ పట్ల ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి సరఫరా ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్లోని ఓ పబ్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం.. ఇందులో పలువురు ప్రముఖుల పిల్లలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే డ్రగ్స్కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఆ ప్రముఖులు ఎలా కట్టడి చేస్తున్నారో తెలియదు కానీ.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన తల్లి మాత్రం గంజాయికి అలవాటు పడ్డ తన కుమారుడిని సరైన దారిలోకి తెచ్చేందుకు వినూత్న పద్ధతిని అవలంబించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి అలవాటు పడ్డ తన 15 ఏళ్ల కుమారుడికి ఓ తల్లి చాలా కఠినమైన శిక్ష విధించింది. మరో మహిళ సహాయంతో తన కుమారున్ని పట్టుకుని చేతులు కట్టిపెట్టి అతని కళ్లపై కారం పూసింది. దీంతో ఆ బాధకు తట్టుకోలేక ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. నీళ్లు ఇవ్వమని బతిమాలుతూ తీవ్రంగా దుఃఖించాడు. అయితే అతని బాధను ఆ తల్లి పట్టించుకోలేదు. నీళ్లు ఇవ్వాలంటే గంజాయి మానేస్తానని చెప్పి ఒట్టు వేయాలని ఆమె అడిగింది. దీంతో అందుకు ఒప్పుకున్న అతను అలాగే చేస్తానని.. గంజాయిని ఇకపై ముట్టుకోనని తెలిపాడు. ఈ క్రమంలో అతనికి తన తల్లి నీళ్లు ఇచ్చింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాగా ఆ తల్లి చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. డ్రగ్స్కు అలవాటు పడుతున్న తమ పిల్లలను ఇలా కఠినంగా శిక్షిస్తేనే కానీ వారిలో మార్పు రాదని.. ఆ తల్లి ఇలా చేసినందుకు ఆమెకు హ్యాట్సాఫ్ అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం.. మరీ ఇంత కఠినంగా ప్రవర్తించవద్దని.. పిల్లలు డ్రగ్స్ లేదా గంజాయిని మానేసేలా ఇంకా వేరే ఏదైనా మార్గాన్ని అనుసరించాలని.. సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…