Viral Video : ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు. అనుకోకుండానే జరుగుతాయి. అయితే మనం చేజేతులా కొన్నిసార్లు చేసే పొరపాట్లే మనకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంటాయి. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా కొందరు వద్దన్న పనినే చేస్తుంటారు. అయితే అలాంటి ప్రమాదాల్లో కొందరు అదృష్టవశాత్తూ బయట పడుతుంటారు. అవును.. అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఓ వ్యక్తి రైలు పట్టాలను దాటబోయాడు. గేట్ వేసి ఉంది. ఆగుదామని అనుకోలేదు. బైక్ను గేట్ కింద నుంచి పట్టాల మీదకు తెచ్చాడు. అయితే అనుకోకుండా అతని బైక్ అదుపు తప్పి కింద పడింది. అయితే ఆ సమయంలో బైక్ పట్టాల మీద ఉంది. కానీ అతను పక్కన ఉన్నాడు. దీంతో అటుగా వచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాల మీద ఉన్న బైక్ను ఢీకొడుతూ వెళ్లింది. కొద్దిలో అయితే అతను పట్టాల మీదకు వెళ్లి ఉంటే అతను ట్రెయిన్ కింద పడి ఉండేవాడు. ప్రాణాలు పోయేవి. కానీ బైక్ మాత్రమే పట్టాల మీద ఉండడంతో అతను తృటిలో.. వెంట్రుకవాసిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరూ అతన్ని విమర్శిస్తున్నారు. కాసేపు ఆగి ఉంటే కొంపలు మునిగిపోతాయా.. అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…