Deepthi Sunaina : బిగ్ బాస్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే జంట.. దీప్తి సునైన, షణ్ముఖ్. కానీ వీరు విడిపోయారు. వీరిద్దరూ కలసి ఉంటే తాజాగా జరిగిన వాలెంటైన్స్ డే వీరికి ఎంతో ప్రత్యేకం అయి ఉండేది. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అనంతరం కొద్ది రోజులకు వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. వీరి బ్రేకప్కు కారణం ఏమిటనేది అందరికీ తెలుసు. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు షణ్ముఖ్తో హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయిన సిరి మాత్రం తన ప్రియుడు శ్రీహాన్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో షణ్ముఖ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా షణ్ముఖ్ జీవితాన్ని నాశనం చేసిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే అది గతం. ఇకపై చేయాల్సింది ఏమిటన్నది షణ్ముఖ్, దీప్తిల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.
వీరు విడిపోయిన తరువాత సోషల్ మీడియాలో ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడిచింది. ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా వీరు కలవబోతున్నారని.. బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అవుతుందని.. అదే వేదికపై వీళ్లను కలుపుతారని.. వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కాలేదు. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దీప్తి సునైన పెట్టిన పోస్టు వైరల్గా మారింది.
తన శరీరంపై ఉన్న టాటూలు కనిపించేలా విచారమైన ముఖంతో కూడిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. అలాగే.. ఆనందం అనేది మనకు మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత, వేరొక మనిషి నీకు అది తీసుకురారు.. అంటూ కామెంట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే ఆమె తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే రానున్న రోజుల్లో అయినా వీరు కలుస్తారా, లేక భగ్న ప్రేమికుల్లా ఉండిపోతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…