Team India : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు ప్రమోషన్ లభించింది. పంత్ను టీమిండియా వైస్ కెప్టెన్గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పంత్.. ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం అయ్యే వెస్డింటీస్ టీ20 సిరీస్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. విండీస్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ వైస్ కెప్టెన్గా నియామకం అయ్యాడు.
ఇటీవల జరిగిన వెస్డిండీస్ వన్డే సిరీస్లో మొదటి వన్డేకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. తన సోదరి వివాహం కోసం అతను మొదటి వన్డే ఆడలేదు. ఇక రెండో వన్డేలో ఆడినా.. ఆ మ్యాచ్లో అతను గాయాల పాలయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో మూడో వన్డేకు ఎంపిక కాలేదు. అలాగే టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో పంత్ను బీసీసీఐ వైస్ కెప్టెన్గా నియమించింది.
కాగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొడ కండరాలు పట్టేయడంతో విండీస్ టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మధ్యే వన్డేల్లో మళ్లీ ఆడిన కుల్దీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో అతనిక టీ20 సిరీస్లో చోటు దక్కింది. కాగా భారత్, వెస్టిండీస్ల మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ను భారత్ 3-0 తో కైవసం చేసుకుంది.
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…