Team India : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు ప్రమోషన్ లభించింది. పంత్ను టీమిండియా వైస్ కెప్టెన్గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పంత్.. ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం అయ్యే వెస్డింటీస్ టీ20 సిరీస్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. విండీస్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ వైస్ కెప్టెన్గా నియామకం అయ్యాడు.
ఇటీవల జరిగిన వెస్డిండీస్ వన్డే సిరీస్లో మొదటి వన్డేకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. తన సోదరి వివాహం కోసం అతను మొదటి వన్డే ఆడలేదు. ఇక రెండో వన్డేలో ఆడినా.. ఆ మ్యాచ్లో అతను గాయాల పాలయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో మూడో వన్డేకు ఎంపిక కాలేదు. అలాగే టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో పంత్ను బీసీసీఐ వైస్ కెప్టెన్గా నియమించింది.
కాగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొడ కండరాలు పట్టేయడంతో విండీస్ టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మధ్యే వన్డేల్లో మళ్లీ ఆడిన కుల్దీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో అతనిక టీ20 సిరీస్లో చోటు దక్కింది. కాగా భారత్, వెస్టిండీస్ల మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ను భారత్ 3-0 తో కైవసం చేసుకుంది.
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…