Viral News : ప్రేమ కోసమని కొందరు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్ కోసం ఎన్నో కష్టాలు పడతారు. వారికి ఎంతో సహాయం చేసి ఆదుకుంటారు. అయితే కొందరు మాత్రం కేవలం స్వార్థం కోసమే ప్రేమను ఉపయోగించుకుంటారు. చివరకు తమ అవసరం తీరాక తమ లవర్ను వదిలించుకుంటారు. ఇలాంటి వాళ్లను మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. సినిమాల్లోనూ చూపిస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
మెక్సికోకు చెందిన ఉజియెల్ మార్టినెజ్ స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను ఓ మహిళను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె తల్లికి అనారోగ్యం కారణంగా కిడ్నీ చెడిపోవడంతో మార్పిడి చేయాల్సి వచ్చింది. దీంతో మార్టినెజ్ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు.
వైద్యులు పరీక్షలు చేసి చూడగా.. కిడ్నీ సరిపోయింది. దీంతో మార్టినెజ్ అనుమతి మేరకు అతని ఒక కిడ్నీని తన ప్రియురాలి తల్లికి అమర్చారు. అయితే నెల రోజుల పాటు అంతా బాగానే ఉంది. కానీ సడెన్గా మార్టినెజ్ ప్రియురాలు అతన్ని మోసం చేసింది. అతన్ని విడిచిపెట్టింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని మార్టినెజ్ టిక్టాక్ వీడియో ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. కొన్ని కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. అందరూ మార్టినెజ్కు సానుభూతి తెలుపుతున్నారు.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కోలుకుంటున్నానని.. తన గర్ల్ ఫ్రెండ్పై తనకు ఎలాంటి కోపం లేదని, ఆమె సంతోషంగా ఉంటే చాలని.. అంటున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుందని అతని ప్రియురాలిని నెటిజన్లు తీవ్రంగా దూషిస్తున్నారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి పరిస్థితి ఏ లవర్కూ రాకూడదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…