Viral News : వేయి అబద్దాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయాలని అంటారు. అయితే పెళ్లి చేసేందుకు అబద్దాలు ఆడవచ్చు.. కానీ అవి షాక్కు గురి చేసే అబద్ధాలు అయి ఉండకూడదు. అలాంటి అబద్ధాలు ఆడితే ఆ పెళ్లిళ్లు జరగవు. మధ్యలోనే ఆగిపోతాయి. ఇలాంటి పెళ్లిళ్లు ఎన్నింటినో మనం మధ్యలోనే ఆగిపోవడాన్ని చూశాం. ఇక సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లోనూ చోటు చేసుకుంది. సరిగ్గా పెళ్లి మండపం వద్దకు వెళ్లి కూర్చుంటే ఇంకొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగుతుంది అనగా.. అసలు విషయం బయట పడింది. దీంతో పెళ్లి కూతురు తనకు పెళ్లి వద్దని అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది.. అన్న విషయానికి వస్తే..
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ అనే ప్రాంతంలో ఓ చోట పెళ్లి జరుగుతోంది. ముందు రోజు అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి జరుగుతోంది. ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు మండపం వద్దకు చేరుకుని దాన్ని ఎక్కే క్రమంలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతను ధరించిన విగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్కు గురైంది. దీంతో ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసుకుంది. తనకు పెళ్లి వద్దంటే వద్దని ఖరాఖండిగా చెప్పేసింది.
అయితే పెద్దలు పంచాయతీ పెట్టి ఆ వధువుకు నచ్చజెప్పాలని చూశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. తనకు బట్టతల ఉన్న వ్యక్తి భర్తగా వద్దని ఆమె చెప్పింది. దీంతో పెళ్లి కోసం వారు పెట్టిన రూ.5.66 లక్షల ఖర్చును వరుడి కుటుంబం వెనక్కి ఇచ్చేయాలని తీర్మానించారు. అయితే అంతటితో వధువు ఆగలేదు. వరుడిపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…