Viral News : ప్రపంచ వ్యాప్తంగా అనేక చేప జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని రకాల జాతులకు చెందిన చేపలను మాత్రమే తింటుంటారు. అయితే కొన్ని చేపలు బరువు ఎక్కువగా పెరగడమే కాకుండా.. అధిక ధరను పలుకుతుంటాయి. అలాంటి చేపల గురించి గతంలో మనం చదివాం. అయితే తాజాగా అలాంటిదే ఓ అత్యంత ఖరీదైన చేపను జాలర్లు విక్రయించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పల్లిపాలెం చేపల మార్కెట్ లో తాజాగా 21 కేజీల బరువు ఉన్న కచిడి అనే జాతికి చెందిన మగ చేపను భారీ ధరకు విక్రయించారు. ఈ చేపకు వేలం నిర్వహించగా.. అత్యధిక ధర పలికింది. దీన్నే బంగారు చేప అని కూడా అంటారు.
ఇక వేలంలో ఆ చేపను ఓ వ్యక్తి ఏకంగా రూ.2.60 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. అయితే నిజానికి కచిడి జాతికి చెందిన చేపల్లో ఆడ చేప కన్నా మగ చేపకే ధర, డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఆ మగ చేపకు అంతటి ధర పలికింది.
కచిడి చేపల పొట్ట భాగంలో ఉండే గాల్ బ్లాడర్ను బలానికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. కనుక ఈ చేపలకు అధికంగా ధర ఉంటుంది. సాధారణంగా శస్త్ర చికిత్స చేసినప్పుడు కుట్లు వేసేందుకు ఉపయోగించే దారాలను తయారు చేసేందుకు కూడా ఈ చేప గాల్ బ్లాడర్ను వాడుతారు. అందుకనే ఆ చేపలకు అంతటి డిమాండ్ ఉంటుంది. ఏది ఏమైనా ఆ చేప అంతటి ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…