Viral News : టాలెంట్ అనేది నిజంగా ఎవరి సొత్తూ కాదు. కొందరికి అది పుట్టుకతోనే వస్తుంది. దానికి కాస్తంత మెరుగులు పెట్టాలే కానీ వారు అద్భుతాలు సృష్టిస్తారు. సరిగ్గా ఆ బాలిక కూడా అలాగే చేస్తోంది. నోరు తిరగడానికి కూడా కష్టమైన వయస్సులో ఏకంగా పెద్ద పెద్ద మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఒడిశాలోని జగత్సింగ్ పూర్ జిల్లాలో ఉన్న తారాడపాడ గ్రామానికి చెందిన రష్మి రజంన్ మిశ్రా కుమార్తె డి.సాయి శ్రేయాంసి వయస్సు 6 ఏళ్లు. 1వ తరగతి చదువుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం ఆన్లైన్లోనే క్లాసులకు హాజరవుతోంది. అయితే ఈ బాలిక ఎంతో కష్టమైన మంత్రాలను అవలీలగా పఠిస్తోంది.
తాజాగా ఈ బాలిక 24 నిమిషాల 50 సెకన్లలో ఏకంగా 108 మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను రోజూ ఇంట్లో పఠించే మంత్రాలను శ్రద్ధగా విని నేర్చుకున్నానని ఆ బాలిక తెలియజేసింది. అంతేకాదు.. ఆమెకు ఒడిస్సీ నృత్యం కూడా వచ్చు. త్వరలోనే అందులోనూ పేరు తెచ్చుకుంటానని ఆ బాలిక చెబుతోంది. ఏది ఏమైనా.. ఇంత చిన్న వయస్సులో అంత కఠినమైన మంత్రాలను పఠిస్తుందంటే.. ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! కాగా ఈ బాలిక సాధించిన ఈ ఫీట్కు గాను ఈమె పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…