NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులకు కూడా ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రముఖ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ప్రేక్షకుల నుండే కాకుండా ఎన్టీఆర్ తన లైఫ్ లో జరిగిన మూమెంట్స్ ని కూడా అప్పుడప్పుడూ షేర్ చేసుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా ఈ షో లో ఒక క్వశ్చన్ కి సమాధానంగా నరసింహనాయుడు సినిమా గురించి ఇంట్రెస్టెంగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు. నరసింహనాయుడు సినిమాకు బి. గోపాల్ డైరెక్షన్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ అందించారని ఎన్టీఆర్ అన్నారు. తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా నరసింహనాయుడు అని తెలిపారు. ఈ సినిమాను తాను ఊర్వశి థియేటర్ లో చూశానని అన్నారు.
ఈ సినిమా చూస్తున్నప్పుడు ముందున్న సీట్ ని గట్టిగా తంతే ఈ సీట్ విరిగిపోయిందట. అలాగే ఎన్టీఆర్ కూచిపూడి డాన్సర్ అని, తన గురువు సుధాకర్ అని అన్నారు. ప్రజంట్ ఆయన ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారని.. ప్రజంట్ ఆయన్ను కలవడానికి వీలు లేదని అన్నారు. అలాగే ఎన్టీఆర్ తనకు కూచిపూడి డాన్స్ ని నేర్పించిన గురువు సుధాకర్ కి నమస్కారాలు చేసి థ్యాంక్స్ చెప్పారు.
తాను ఏం చదువుకున్నా.. తనకు నటన మాత్రమే తెలుసని అన్నారు. ఆయనకు తాత, నాన్న స్పూర్తితో నటుడు కావాలనే ఆసక్తి పెరిగిందని ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఆ నటన కోసం తాను చావడానికైనా సిద్ధం అని అనడం షాకింగ్ గా నిలిచింది.
ఇక ఈ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ ప్రతి ఒక్క వ్యక్తినీ ఎంతో ఆత్మీయతగా పలకరిస్తూ.. తన ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ప్రజంట్ ఈయన ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నెక్ట్స్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…