Vijay Devarakonda : గత కొన్నేళ్ల కిందట దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జనగనమణ అనే చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ మూవీని పూరీ మహేష్తో తీయలేకపోయారు. తరువాత వెంకటేష్తో ఆ సినిమాను తీద్దామని పూరీ ప్లాన్ చేశారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు.
ఇక చివరకు పూరీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండతో ఆ మూవీని పూరీ జగన్నాథ్ తీస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జనగనమణ యూఎస్ఏలో ప్రారంభం అవుతుందని సమాచారం.
లైగర్ మూవీతో పూరీ, విజయ్ ల మధ్య బాండింగ్ ఏర్పడింది. లైగర్ షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పూరీతో కలిసి జనగనమణ చిత్రాన్ని చేయనున్నట్లు విజయ్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇక లైగర్ మూవీని వచ్చే ఆగస్టులో విడుదల చేయనున్నారు. అనన్య పాండే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో నటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…