Vijay Devarakonda : గత కొన్నేళ్ల కిందట దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జనగనమణ అనే చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ మూవీని పూరీ మహేష్తో తీయలేకపోయారు. తరువాత వెంకటేష్తో ఆ సినిమాను తీద్దామని పూరీ ప్లాన్ చేశారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు.
ఇక చివరకు పూరీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండతో ఆ మూవీని పూరీ జగన్నాథ్ తీస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జనగనమణ యూఎస్ఏలో ప్రారంభం అవుతుందని సమాచారం.
లైగర్ మూవీతో పూరీ, విజయ్ ల మధ్య బాండింగ్ ఏర్పడింది. లైగర్ షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పూరీతో కలిసి జనగనమణ చిత్రాన్ని చేయనున్నట్లు విజయ్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇక లైగర్ మూవీని వచ్చే ఆగస్టులో విడుదల చేయనున్నారు. అనన్య పాండే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…