Vijay Devarakonda : ఒకప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఇలా ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంటూ.. ఎవరి వర్క్ షెడ్యూల్ వారికి ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. ఇక ఎవరి సొంత బ్యానర్ లో వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. ఇక షెడ్యూల్ విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ చాలా పనులే ఉంటాయి. అలాంటి సినిమా రియల్ కష్టాలన్నీ ఇప్పుడు హీరోలకి, దర్శకులకు కూడా తెలుస్తున్నాయి. లేటెస్ట్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన విజయ్ కెరీర్ లో సక్సెస్ అవుతూనే.. బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటికే రౌడీ అనే బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సొంత బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం హీరో మీదే డిపెండ్ అయి ఉండటం వల్ల పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేదని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం విజయ్ రంగంలోకి దిగాడు. చాలా ఫాస్ట్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ కష్టాలపై మాట్లాడాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రొడ్యూసర్స్ దొరక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని అన్నాడు.
అలా తనలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే సొంత బ్యానర్ నిర్మించానని అన్నారు. ఇక ప్రొడక్షన్ పనులను చాలా బాధ్యతతో చేయాలని అన్నారు. ఆఖరికి పడుకునే ముందు కూడా సినిమా గురించే ఆలోచనలు వస్తాయని, అప్పుడు మాత్రం ఇదంతా మనకు అవసరమా అని.. అనిపిస్తుందని విజయ్ అన్నారు.
పుష్పక విమానం సినిమాతో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారని అన్నారు. ఈ సినిమా ప్రీమియర్ ను నవంబర్ 11వ తేదీన నైట్ చూసి లైగర్ సినిమా కోసం అమెరికా వెళ్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత అభిమానులదేనని అన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోగా.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…