Venkatesh : టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేష్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. ఎక్కువగా తన సోషల్ మీడియాలో వెంకటేష్ ప్రొఫెషనల్ సమాచారాన్ని మాత్రమే తన అభిమానులతో షేర్ చేసుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో లైఫ్ లెసెన్స్, కోట్స్, స్టోరీల్లాంటివి కూడా షేర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సమంత, నాగచైతన్యలు తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పినప్పటి నుండి కంటిన్యూగా ఏదో ఒక కోట్ పెడుతూ వైరల్ అవుతున్నారు.
ముఖ్యంగా నమ్మకం, ప్రేమ, రిలేషన్ షిప్ లాంటి విషయాలపై పోస్టులు చేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి ఓ పోస్ట్ వెంకటేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో.. నిన్ను ఇష్టపడిన వాళ్ళను మిస్ యూస్ చేయకు. నిన్ను కావాలనుకునే వాళ్ళకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే నిన్ను ఎక్కువగా నమ్ముతారో వాళ్ళను మాత్రం ఎప్పటికీ మోసం చేయోద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకునే వాళ్ళను అస్సలు మర్చిపోవద్దు.. అంటూ వెంకటేష్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ పోస్ట్ పై పలు కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ కొటేషన్స్ చైతన్య, సమంతలను ఉద్దేశించి పెడుతున్నారా.. అని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ విడిపోయే ముందు వెంకటేష్ కూడా సర్ధి చెప్పడానికి ప్రయత్నించారని, ఇద్దరూ విడిపోకుండా ఉండాలని హితబోధ చేసినట్లు సమాచారం. అయినా కూడా సమంత, నాగచైతన్యలు మాత్రం విడాకులు తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఎంతో మంది ఆసక్తికరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…