Srinu Vaitla : తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్, యాక్షన్, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఒకరు. ఈయన సినిమాలకు భారీగా బ్రేక్ ఇచ్చారు. అలాగే టాలీవుడ్ లో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో వర్క్ చేశారు. కానీ ఇప్పటివరకు శ్రీను వైట్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో సినిమాలు చేయకపోవడం గమనార్హం. లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై డైరెక్టర్ శ్రీను వైట్ల స్పందించారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉంటే బాగుండేదని, తనకు కోరిక ఉందని.. అలాగే తన కథలు పవన్ కళ్యాణ్ కు సింక్ అవుతాయని అభిప్రాయపడ్డారు.
అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆఫర్ కూడా వచ్చిందని, ఆ టైమ్ లో పవన్ కళ్యాణ్ కు సూట్ అయ్యే కథలు దొరకలేదని, ఇంతకు ముందు రెండు సార్లు కలిశామని అన్నారు. నెక్ట్స్ బాలకృష్ణతో కూడా సినిమా చేయాలని అనుకున్నాను గానీ అది కుదరలేదని నిరాశ వ్యక్తం చేశారు. బాలకృష్ణను డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ ఏది వర్కవుట్ అవ్వలేదని అన్నారు. బాలకృష్ణను డైరెక్టర్లందరూ ఒకేలా చూపిస్తున్నారని, ఆయన పాపులర్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ.. తన మార్క్ ని యాడ్ చేసి ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో ప్రజంట్ చేయాలనుకున్నట్లు తెలిపారు.
స్క్రిప్ట్ కూడా ఆ టైమ్ లో రెడీగా ఉందని, కానీ ఆయనకు సబ్జెక్ట్ చెప్పే టైమ్ కుదరలేదని అన్నారు. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మంచు విష్ణు హీరోగా ఢీ అంటే ఢీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతోపాటుగా మరో మూడు స్క్రిప్టులు చేతిలో ఉన్నాయని, ఈ సినిమాల తర్వాత మహేష్ బాబును కలుస్తానని శ్రీనువైట్ల తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…