Varsha : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఎన్నో ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో దీన్నుంచి కొందరు స్టార్ కమెడియన్లు దూరమయ్యారు. దీంతో ఈ షో ఎలా కొనసాగుతుందా.. రేటింగ్స్.. వస్తాయా.. లేదా.. అని సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయాలను పక్కన పెడితే.. ఈ షోలో రష్మి, సుధీర్ జంటకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. వీరు స్కిట్ చేస్తే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. అయితే వీరు మాత్రమే కాకుండా.. వర్ష, ఇమ్మాన్యుయెల్ జంటకు కూడా అలాంటి పేరే వచ్చింది.
రష్మి, సుధీర్ మధ్య లవ్ ట్రాక్ను ఎంతో కాలం నుంచి నడిపిస్తున్నారు. అయితే అది కేవలం షో కోసం మాత్రమే. కానీ నిజంగానే వీరి మధ్య ఏదో ఉందని.. అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే తాము లవ్ ట్రాక్ నడిపేది కేవలం షో కోసం మాత్రమేనని వారు ఇది వరకు స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు వర్ష, ఇమ్మాన్యుయెల్ కూడా ఇలాగే చెప్పాల్సి వస్తోంది. అయితే ఈ మధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్ష.. ఇమ్మాన్యుయెల్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను ఫ్రెండ్ కన్నా ఎక్కువని చెప్పింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇమ్మాన్యుయెల్ గురించి వర్ష మాట్లాడుతూ.. అతను కేవలం నా ఫ్రెండ్ అని చెప్పలేం. అంతకన్నా ఎక్కువే. అసలు మా మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏమిటో అర్థం కావడం లేదు. మా మధ్య ఏదో తెలియని బంధం ఉంది. అయితే అది భవిష్యత్తులో నిజం కావచ్చు. ఏదైనా జరగవచ్చు. మేం ఒకరంటే ఒకరికి ఇష్టం.. అని వర్ష కామెంట్స్ చేసింది. దీంతో వర్ష ఎందుకు ఇలా మాట్లాడింది.. అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇది కూడా ఏదైనా షో కోసమేనా.. అని సందేహాలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాగే చేశారు కాబట్టి.. వర్ష మాట్లాడింది నమ్మలేమని అంటున్నారు.
ఇక పటాస్ షోలో సక్సెస్ అయిన ఇమ్మాన్యుయెల్కు జబర్దస్త్లో ఆఫర్ వచ్చింది. దీంతో అందులో అతను కొనసాగుతున్నాడు. ఇక హైపర్ ఆది టీమ్లో ముందుగా స్కిట్స్ చేసిన వర్ష ఇప్పుడు ఇమ్మాన్యుయెల్తో కలిసి స్కిట్స్ చేస్తోంది. ఇక వర్ష రానున్న బిగ్ బాస్ తెలుగు 6 షోలోనూ పాల్గొనబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…