Chiranjeevi : చిరంజీవికి కోపం వ‌చ్చింది..? బ‌య‌ట‌కు వెళ్లిపోయారు..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ చిత్రం.. ఆచార్య‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఏకంగా రూ.84 కోట్ల మేర న‌ష్టాల‌ను మిగిల్చింది. చిరంజీవి సినిమా కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ మూవీ నిలిచింది. దీంతో చిరంజీవి బాగా హ‌ర్ట‌య్యారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ ఫ‌లితం చూసి ఆయ‌న షాక‌య్యారు. దీంతో కొద్ది రోజుల పాటు ఈ ఒత్తిడి నుంచి బ‌య‌ట పడేందుకు ఆయ‌న కుటుంబ స‌మేతంగా ఈమ‌ధ్యే అమెరికా టూర్‌కు వెళ్లి వ‌చ్చారు. అయితే ఆయ‌న తిరిగి వ‌చ్చాక కూడా ఇంకా ఆచార్య ఇచ్చిన షాక్ నుంచి ఆయ‌న కోలుకోన‌ట్లే క‌నిపిస్తోంది. అందుకు కార‌ణం ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన ఆయ‌న కోపంతో బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు.

ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన చిరంజీవి అక్క‌డ ఓ కార‌ణంతో కోపం చెంది వెంట‌నే అక్క‌డ ఉండ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. అయితే షోను నిర్వ‌హించిన వారు చిన్న మిస్టేక్ చేశార‌ట‌. స్పాన్స‌ర్ పేరును చెప్ప‌డంలో వారు పొర‌పాటు చేసి మ‌ళ్లీ అదే పేరును రిపీట్ చేశార‌ట‌. దీనికి ఆగ్ర‌హం చెందిన చిరంజీవి ఆ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. అయితే చిరంజీవి విష‌యంలో జ‌రిగిన త‌ప్పు కాదిది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కోపంతో బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. దీంతో అస‌లు ఏం జ‌రిగింది.. ఎందుకు ఆయ‌న వెళ్లిపోతున్నారు.. అని విష‌యం తెలుసుకుని నిర్వాహ‌కులు న‌చ్చ‌జెప్పేందుకు య‌త్నించార‌ట‌. కానీ చిరంజీవి షోలోకి రాలేద‌ట‌. ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Chiranjeevi

అయితే చిరంజీవి అంటే ఎంతోమందికి గౌర‌వం. ఆయ‌న విష‌యంలో ఎవ‌రూ పొర‌పాటు చేయ‌రు. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి కోపంగా బ‌య‌ట‌కు వ‌చ్చేశారంటే.. ఆయ‌న మ‌న‌సులో ఏదో ఉంద‌ని.. ఆచార్య ఇచ్చిన ఫ‌లితం నుంచి ఆయ‌న ఇంకా కోలుకోలేద‌ని అంటున్నారు. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సిగా ఉన్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను భారీ ఎత్తున చేయాల‌ని చిరంజీవి మేక‌ర్స్‌కు సూచించార‌ట‌. మ‌రి ఈ మూవీతో చిరంజీవి హిట్ కొట్టి మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM