Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం.. ఆచార్య. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా రూ.84 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. చిరంజీవి సినిమా కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా ఈ మూవీ నిలిచింది. దీంతో చిరంజీవి బాగా హర్టయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ ఫలితం చూసి ఆయన షాకయ్యారు. దీంతో కొద్ది రోజుల పాటు ఈ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆయన కుటుంబ సమేతంగా ఈమధ్యే అమెరికా టూర్కు వెళ్లి వచ్చారు. అయితే ఆయన తిరిగి వచ్చాక కూడా ఇంకా ఆచార్య ఇచ్చిన షాక్ నుంచి ఆయన కోలుకోనట్లే కనిపిస్తోంది. అందుకు కారణం ఓ షోకు గెస్ట్గా వెళ్లిన ఆయన కోపంతో బయటకు వచ్చేయడమే అని చెప్పవచ్చు.
ఓ షోకు గెస్ట్గా వెళ్లిన చిరంజీవి అక్కడ ఓ కారణంతో కోపం చెంది వెంటనే అక్కడ ఉండకుండా బయటకు వచ్చేశారట. అయితే షోను నిర్వహించిన వారు చిన్న మిస్టేక్ చేశారట. స్పాన్సర్ పేరును చెప్పడంలో వారు పొరపాటు చేసి మళ్లీ అదే పేరును రిపీట్ చేశారట. దీనికి ఆగ్రహం చెందిన చిరంజీవి ఆ షో నుంచి బయటకు వచ్చేశారట. అయితే చిరంజీవి విషయంలో జరిగిన తప్పు కాదిది. అయినప్పటికీ ఆయన కోపంతో బయటకు వచ్చేశారట. దీంతో అసలు ఏం జరిగింది.. ఎందుకు ఆయన వెళ్లిపోతున్నారు.. అని విషయం తెలుసుకుని నిర్వాహకులు నచ్చజెప్పేందుకు యత్నించారట. కానీ చిరంజీవి షోలోకి రాలేదట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే చిరంజీవి అంటే ఎంతోమందికి గౌరవం. ఆయన విషయంలో ఎవరూ పొరపాటు చేయరు. అయినప్పటికీ చిరంజీవి కోపంగా బయటకు వచ్చేశారంటే.. ఆయన మనసులో ఏదో ఉందని.. ఆచార్య ఇచ్చిన ఫలితం నుంచి ఆయన ఇంకా కోలుకోలేదని అంటున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్లో ఉన్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నట్లు సమాచారం. అందుకనే చిత్ర ప్రమోషన్స్ను భారీ ఎత్తున చేయాలని చిరంజీవి మేకర్స్కు సూచించారట. మరి ఈ మూవీతో చిరంజీవి హిట్ కొట్టి మళ్లీ ట్రాక్లోకి వస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…