Vantalakka : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాజమౌళి తన ప్రతి సినిమాని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తూ అద్భుతాలు సృష్టిస్తుండగా, ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ వంటలక్కగా కార్తీక దీపం సీరియల్లో అలరిస్తున్న ప్రేమి విశ్వనాథ్ మాత్రం రాజమౌళి ఆఫర్ని సింపుల్గా తిరస్కరించిందట. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ప్రేమి విశ్వనాథ్ స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. వంటలక్కగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రేమి.. ఆర్ఆర్ఆర్ లో మల్లి అనే పాపకు తల్లిగా నటించాల్సి ఉంది. ఆ సమయంలో వంటలక్క రాజమౌళి అడిగిన కాల్షీట్లు ఆమె అడ్జెస్ట్ చేయలేక ఏకంగా నో చెప్పేసిందట. ఆ పాత్రకు అహ్మరిన్ అంజుం అనే నటిని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో ఈమెకు రెండే సీన్లు ఉంటాయి. సినిమా ప్రారంభంలో అలా కనిపించి చివరలో మెరుస్తుంది.
కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినా కూడా రన్టైం ఎక్కువ కావడంతో తొలగించారు. ఫేమస్ సీరియల్ అయిన కార్తీక దీపంలో ప్రేమి ఫుల్ మేకప్తో కనిపించదు. ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోదు. నలుపు ఛాయతో చూడడానికి మామూలు అమ్మాయిలాగా ఉంటుంది. కానీ తన ఆత్మవిశ్వాసమే తన బలం. ఇలాంటి ఒక అమ్మాయిని హీరోయిన్ అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానంతోనే కార్తీక దీపం సీరియల్ మొదలైంది. కార్తీక దీపం సక్సెస్లో ఎక్కువ క్రెడిట్ దక్కాల్సింది అందులోని హీరోయిన్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్కే అని చెప్పవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…