Vani Vishwanath : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వాణీ విశ్వనాథ్ అంటే తెలియనివారు ఉండకపోవచ్చు. 1990వ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. చూడ చక్కని రూపం, మంచి అభినయంతో ఆకట్టుకునే ఈమె తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ, హిందీలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వాణీ విశ్వనాథ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు అన్ని భాషల్లోనూ అగ్ర హీరోలందరి సరసన 120 చిత్రాలకు పైగా నటించింది.
ఇక ఆరోజుల్లో వాణీ విశ్వనాథ్ ఉంటే చాలు సినిమా మినిమమ్ గ్యారంటీ అని నమ్మేవారట దర్శక నిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో కమర్షియల్ మూవీసే కాకుండా ఎక్కువ కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించి మెప్పించి, మార్కెట్ లో ఆమె క్రేజ్ పెంచుకుంది. ప్రధానంగా మలయాళం మరియు తెలుగు చిత్రాలలో కనిపించింది. 2000లో, టీవీ చంద్రన్ దర్శకత్వం వహించిన సుసన్నాలో తన నటనకు వాణీ విశ్వనాథ్ రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. వాణీని మాలీవుడ్ యొక్క యాక్షన్ క్వీన్ అని పిలుస్తారు.
నిజానికి కేరళ అమ్మాయి అయిన వాణీ 13 మే 1971 ఒల్లూర్ , కేరళలో జన్మించారు. వాణీ తండ్రి తాళత్తు విట్టల్ విశ్వనాథన్ కేరళలో మంచి పేరు పొందిన జ్యోతిష్యుడు. తల్లి గిరిజ సాధారణ గృహిణి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. అందులో నాలగవ సంతానం వాణీ విశ్వనాథ్. తాళత్తు విట్టల్ విశ్వనాథన్ ఎంత పాపులర్ అంటే సినిమా వాళ్ళందరూ నిర్మాతలందరూ ఈయన దగ్గరకే వచ్చి, ఓపినింగ్ నుంచి రిలీజ్ దాకా ముహుర్తాలు ఈయన దగ్గరే పెట్టించుకునేవారట.
వాణీ విశ్వనాథ్ తన పాఠశాల విద్య ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో మరియు ఆ తర్వాత చెన్నైలో చదివింది. ఆమె 13 సంవత్సరాల వయస్సులో, ఆమె తండ్రి జ్యోతిష్యం ద్వారా ఆమె నటిని అవుతానని మరియు ఆమె రాజకీయాల్లోకి వస్తానని జోస్యం చెప్పారట. తండ్రి చెప్పిన విధంగానే ఆమె మలయాళం మరియు తెలుగు సినిమాలలో కనిపించింది. ఆమె వరుసగా మమ్ముట్టితో ది కింగ్లో మరియు మోహన్లాల్తో ఉస్తాద్లో మరియు సురేష్ గోపీతో చింతామణి కొలకాసేలో నటించింది. వాణీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఘరానా మొగుడు మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. వాణి ఫైటింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ పొందింది మరియు సినిమాల్లో చాలా మంది పురుషులతో కూడా ధైర్యంగా పోరాడింది. వాణీ విశ్వనాథ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తితో జంగ్ మరియు భీష్మ అనే రెండు హిందీ చిత్రాలలో కూడా నటించింది.
ఇక ఆ తరువాత మలయాళ సినిమాల్లో విలన్ వేస్తూ, కమెడియన్ గా మారిన బాబు రాజ్ తో పలు చిత్రాల్లో నటించిన వాణీ చివరకు అతనితో ప్రేమలో పడి 2002లో వివాహం చేసుకుంది. ఈ జంటకి అర్చా, అద్రి అనే ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వాణీ 2017లో జయ జానకి నాయక చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా వాణీ విశ్వనాథ్ 2017లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…