Upasana : ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. చాలా మంది పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు.. వారి కుటుంబాలకు చెందిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో రామ్చరణ్, ఉపాసనల గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వారు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. అందుకు కారణం కూడా ఉందని.. అనేక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలపై ఉపాసన స్పందించింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్తో ఉపాసన మాట్లాడింది. మీరు పిల్లల్ని కనడం లేదంటే అందుకు మిమ్మల్ని అభినందించవచ్చు.. అని ఆయన అన్నారు. అయితే ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపాసన తెలియజేసింది. సద్గురు అన్న వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఉపాసన స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. జనాభా పెరిగిపోవడం వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని చూసిన ఉపాసన ఇలా స్పందించింది. ఇదేదీ నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి, నా కామెంట్స్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దయచేసి ఆ రోజు సద్గురుతో నేను ఏం మాట్లాడానో మరొకసారి ఆ వీడియోలో చూసి తెలుసుకోండి, ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి.. అంటూ ఉపాసన పోస్ట్ పెట్టింది.
ఇలా ఉపాసన పోస్ట్ పెట్టడంతో వారు పిల్లల్ని కనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టమైంది. కానీ మరి 10 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు ఆ కలను వారు ఎందుకు నిజం చేసుకోలేదు.. అన్న ప్రశ్న మాత్రం మళ్లీ ఉత్పన్నమవుతోంది. అయితే దీనికి మళ్లీ ఆమె సమాధానం చెబుతుందో.. లేదో.. చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…