Upasana : ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. చాలా మంది పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు.. వారి కుటుంబాలకు చెందిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో రామ్చరణ్, ఉపాసనల గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వారు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. అందుకు కారణం కూడా ఉందని.. అనేక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలపై ఉపాసన స్పందించింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్తో ఉపాసన మాట్లాడింది. మీరు పిల్లల్ని కనడం లేదంటే అందుకు మిమ్మల్ని అభినందించవచ్చు.. అని ఆయన అన్నారు. అయితే ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపాసన తెలియజేసింది. సద్గురు అన్న వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఉపాసన స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. జనాభా పెరిగిపోవడం వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని చూసిన ఉపాసన ఇలా స్పందించింది. ఇదేదీ నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి, నా కామెంట్స్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దయచేసి ఆ రోజు సద్గురుతో నేను ఏం మాట్లాడానో మరొకసారి ఆ వీడియోలో చూసి తెలుసుకోండి, ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి.. అంటూ ఉపాసన పోస్ట్ పెట్టింది.
ఇలా ఉపాసన పోస్ట్ పెట్టడంతో వారు పిల్లల్ని కనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టమైంది. కానీ మరి 10 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు ఆ కలను వారు ఎందుకు నిజం చేసుకోలేదు.. అన్న ప్రశ్న మాత్రం మళ్లీ ఉత్పన్నమవుతోంది. అయితే దీనికి మళ్లీ ఆమె సమాధానం చెబుతుందో.. లేదో.. చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…