Rajamouli : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే ఆయన చిత్ర యూనిట్తో కలిసి ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో నాగచైతన్య కూడా ఒక కీలకపాత్రలో నటించాడు. చైతూ రోల్ ఈ మూవీలో 15 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ మూవీ వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు రిలీజ్ కానుంది.
ఇక లాల్ సింగ్ చడ్డా మూవీకి గాను తాజాగా పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలకు అమీర్ ఖాన్ స్పెషల్ షో వేయించారు. ఈ షోకు దర్శకులు రాజమౌళి, సుకుమార్లతోపాటు చిరంజీవి, చైతూలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారు ఈ మూవీని చూస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రూ.వందల కోట్లు పెట్టిన తీసిన సినిమాలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. బాయ్కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ను సినిమా రిలీజ్ అయినప్పుడల్లా అక్కడి ప్రేక్షకులు ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ వర్గాలు సినిమాలను రిలీజ్ చేయాలంటేనే వణికిపోతున్నాయి. అయితే ఈ మూవీని ముందుగానే రాజమౌళి, సుకుమార్లతోపాటు చిరంజీవి వంటి స్టార్స్కు చూపిస్తే వారు ఏమైనా సలహాలు ఇస్తే.. చివరి నిమిషంలో సినిమాలో మార్పులు చేయవచ్చు కదా.. దీంతో సినిమాకు ఫ్లాప్ టాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూసేలా వారిని థియేటర్లకు రప్పించవచ్చు.. అని అమీర్ఖాన్ అనుకున్నారు. అందుకనే ఆయన రాజమౌళి, సుకుమార్ లతోపాటు చిరంజీవిని ఆహ్వానించి వారికి ఈ మూవీ స్పెషల్ షోను వేసి చూపించారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, జోకులు పేలుతున్నాయి. రాజమౌళికి, చిరంజీవికి సినిమా చూపించారు సరే. కానీ రాజమౌళి ఇచ్చే సలహాలను పాటిస్తే సినిమా హిట్ అవుతుంది.. కానీ చిరంజీవి ఇచ్చే సలహాలను పాటిస్తే మాత్రం అమీర్ఖాన్ బుగ్గిపాలు అవుతాడని.. కనుక రాజమౌళి సలహాలనే పాటించాలని.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య వార్ నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో అమీర్ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…