Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ఓ వైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నెరవేరుస్తూనే.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే చరణ్ వ్యాపారాలను కూడా స్వయంగా ఆమే పర్యవేక్షిస్తుంటారు. ఇప్పటికే 200కు పైగా అనాథ, వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. జూ పార్క్ లో వన్య ప్రాణులను దత్తత తీసుకున్న ఆమె వాటి సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. ఇక ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మెగా కోడలు ఉపాసన గతంలో ఆడి ఇ-ట్రాన్(Audi E Tron) కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కారుకు సంబందించిన వీడియోను ఆమె నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను అప్గ్రేడ్ అయ్యానంటూ ఆమె చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీది అప్గ్రేడ్ అవుతుందని చెప్పిన ఉపాసన.. అందుకనుగుణంగా తాను కూడా అప్గ్రేడ్ అయ్యానంటూ చెప్పారు. అందులో భాగంగానే ఆడి ఇట్రాన్ కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు. తన అన్ని అవసరాలకు కూడా ఈ కారు ఎంతో అనువుగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
ప్రయాణానికి సైతం ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉందని.. వాయిస్ కమాండింగ్ ఆప్షన్ మరింత బాగుందంటూ ఉపాసన వీడియోను పంచుకున్నారు. ఇక ఈ కారు ధర రూ.1.20 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గతంలో కారు కొన్న సందర్భంలో.. మీరు భవిష్యత్ కోసం సిద్ధంగా ఉన్నప్పుడు.. సౌకర్యం, లగ్జరీ విషయంలో ఎప్పుడూ రాజీపడనప్పుడు.. అదే నిజమైన పురోగతి అనిపించుకుంటుంది. స్థిరమైన, ప్రగతిశీల, విలాసవంతమైన భవిష్యత్ను నిర్మించడానికి ఇదే ఆరంభం.. అంటూ ఉపాసన చెప్పిన మాటలను ఆడి కంపెనీ తమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
కాగా ఉపాసన కొత్త కారును చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఎంతో లగ్జరీగా ఉందని, కలర్ కూడా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…