Balakrishna : యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరున్న రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. అయితే రాజశేఖర్ కెరీర్ డల్ అయింది కానీ ఒకప్పుడు ఆయన తీసిన వరుస సినిమాలు హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల్లో సింహ రాశి ఒకటి. అయితే ఇది వాస్తవానికి బాలయ్య మూవీనట. ఆయన ఈ మూవీని చేయాల్సి ఉంది. కానీ రిజెక్ట్ చేశారు. అది ఎందుకు అలా జరిగింది.. అంటే..
అప్పట్లో బాలకృష్ణ సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీలను తీసి వరుస హిట్స్ కొట్టి మంచి జోరుమీదున్నారు. అయితే ఆయన తరువాత కూడా అలాంటి మూవీలనే చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మదర్ సెంటిమెంట్ కలిగిన సింహరాశి మూవీని చేయాలని దర్శకుడు వి.సముద్ర బాలయ్యను సంప్రదించారట. కానీ బాలయ్య మాత్రం ఫ్యాక్షన్ సినిమా చేద్దాం అన్నారట. అలా చెన్నకేశవ రెడ్డి కథను సిద్ధం చేశారు. దానికి వి.సముద్రను డైరెక్ట్ చేయమని బాలయ్య అడిగారట. కానీ సింహరాశి చేద్దామని పట్టుబట్టడంతో బాలయ్య ఆ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తరువాత చెన్న కేశవరెడ్డి మూవీనే వినాయక్తో చేశారు.
ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీని వి.సముద్ర రాజశేఖర్కు వినిపించారు. దీంతో ఆయనకు కథ నచ్చి ఓకే అన్నారు. అలా సింహరాశి ప్రారంభం అయింది. ఇందులో తల్లి సెంటిమెంట్ను ఎంతో బాగా చూపించారు. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రాజశేఖర్కు మంచి పేరు తెచ్చి పెట్టింది. కానీ అదే సమయంలో తీసిన చెన్నకేశవరెడ్డి మాత్రం ఫ్లాప్ అయింది. తరువాత బాలకృష్ణ వరుసగా మళ్లీ ఫ్యాక్షన్ మూవీలనే చేశారు. కానీ ఏదీ హిట్ కాలేదు. చివరకు ఆయన తన సినిమా కథలను మార్చారు. కానీ సింహరాశి మూవీని బాలయ్య చేసి ఉంటే.. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…