Akira Nandan : తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అకీరా ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఈ మధ్యనే అకీరా బర్త్ డేను జరుపుకోగా.. రక్తదానం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో అందరూ అచ్చం తండ్రిలాగే మంచి గుణం ఉన్నవాడంటూ మెచ్చుకున్నారు. ఇక అకీరా నందన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. చిన్న వయస్సు నుంచే అనేక కళల్లో అతను ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు.
అకీరా నందన్ ఇప్పటికే సంగీతం, హార్స్ రైడింగ్ వంటి కళల్లో ప్రావీణ్యత సంపాదించాడు. ఈ క్రమంలోనే తన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.. పలు ఇతర సందర్భాల్లోనూ పియానోపై అద్భుతంగా పాటలను వాయించి ఆశ్చర్యపరిచాడు. అలాగే గుర్రపు స్వారీ కూడా చేయగలడు. తండ్రి పవన్ లా మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యతను సంపాదిస్తున్నాడు. అయితే అకీరా నందన్ లో ఉన్న ఇన్న టాలెంట్స్ను చూసి అతను సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా.. అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను స్కాట్లండ్లోని ఓ యూనివర్సిటీలో చదవనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే అకీరాతోపాటు రేణు దేశాయ్, ఆద్య కూడా అక్కడికి వెళ్లి వచ్చారు. అకీరాను యూనివర్సిటీలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి అతనికి క్లాసులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అయితే అకీరా ఇక అక్కడే ఉండి చదువుకోనుండడంతో రేణు దేశాయ్ అతన్ని విడిచి ఉండలేక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన చిట్టి పక్షి ఒకటి రెక్కలు వచ్చి గూడు నుంచి బయటకు వెళ్లిపోతుంది.. అంటూ ఇన్డైరెక్ట్గా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్గా మారింది.
అకీరా ఇన్ని రోజుల పాటు తల్లి వద్దే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా గడపబోతున్నాడు. దీంతో అతన్ని విడిచి ఉండలేక రేణు ఆ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. అయితే ఈ విద్యాభ్యాసం 3 ఏళ్లలో ముగియగానే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…