Under 19 Cricket World Cup 2022 : భారత యువ క్రికెట్ ప్లేయర్ల సత్తా మరోమారు ప్రపంచానికి తెలిసింది. ఐసీసీ టోర్నీల్లో ఆధిపత్యం చెలాయించగలమని మరోమారు భారత జట్టు నిరూపించింది. ఇంగ్లండ్తో జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో జయభేరిని మోగించింది. మరోమారు యువ జట్టు భారత క్రికెట్ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసింది.
భారత్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో.. ఇంగ్లండ్పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ నెమ్మదిగా ఆచి తూచి ఆడుతూ ఛేదించింది. దీంతో మరోమారు అండర్ 19 టీమ్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఇది భారత్ అండర్ 19 జట్టుకు వరుసగా 5వ టైటిల్ కావడం విశేషం.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్ 19 జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేదు. 44.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 189 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో జేమ్స్ రో (95) మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక భారత అండర్ 19 జట్టు బౌలర్లలో రాజ్ బవా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ అండర్ 19 జట్టు పతనాన్ని శాసించాడు. అలాగే మరో బౌలర్ రవికుమార్ 4 వికెట్లు తీశాడు. కౌశల్ తంబెకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 195 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో షేక్ రషీద్ 50, నిశాంత్ సంధు 50, రాజ్ బవా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోషువా బోయ్డెన్, జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్ వాల్లకు తలా 2 వికెట్లు దక్కాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…