Under 19 Cricket World Cup : ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ ప్రతిసారి తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ చాంపియన్గా పేరున్న బంగ్లాదేశ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించడం వరుసగా ఇది నాలుగవ సారి కావడం విశేషం.
ఈ సారి జరుగుతున్న టోర్నీలో గ్రూప్లో భారత్, సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే భారత్ సౌతాఫ్రికాను 45 పరుగుల తేడాతో ఓడించింది. అలాగే ఐర్లాండ్పై 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉగాండాపై ఏకంగా 326 పరుగుల రికార్డు తేడాతో భారత్ గెలుపొందింది. ఇక తాజాగా శనివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ధుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్ను ఫిబ్రవరి 5న నిర్వహిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…