Under 19 Cricket World Cup : ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ ప్రతిసారి తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ చాంపియన్గా పేరున్న బంగ్లాదేశ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించడం వరుసగా ఇది నాలుగవ సారి కావడం విశేషం.
ఈ సారి జరుగుతున్న టోర్నీలో గ్రూప్లో భారత్, సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే భారత్ సౌతాఫ్రికాను 45 పరుగుల తేడాతో ఓడించింది. అలాగే ఐర్లాండ్పై 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉగాండాపై ఏకంగా 326 పరుగుల రికార్డు తేడాతో భారత్ గెలుపొందింది. ఇక తాజాగా శనివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ధుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్ను ఫిబ్రవరి 5న నిర్వహిస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…