TS RTC MD VC Sajjanar : కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడినట్లుగానే తెలంగాణలో, ఏపీలో ఆర్టీసీలపై కూడా ఎక్కువగా ప్రభావం పడింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీకి నష్టాలను తగ్గించేందుకు గాను మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.
ఆర్టీసీలో ప్రయాణికులు బస్సులను అద్దెకు తీసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, టూర్లకు గాను బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. అయితే ఇందుకు గాను ఇకపై సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన పనిలేదు. ఆ డిపాజిట్ అవసరం లేకుండానే బస్సులను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రజలకు కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న డిపో మేనేజర్ను సంప్రదించవచ్చని సజ్జనార్ సూచించారు. లేదా 040-30102829, 040-68153333 అనే ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబరలకు కూడా కాల్ చేయవచ్చని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…