TS RTC MD VC Sajjanar : కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడినట్లుగానే తెలంగాణలో, ఏపీలో ఆర్టీసీలపై కూడా ఎక్కువగా ప్రభావం పడింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీకి నష్టాలను తగ్గించేందుకు గాను మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.
ఆర్టీసీలో ప్రయాణికులు బస్సులను అద్దెకు తీసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, టూర్లకు గాను బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. అయితే ఇందుకు గాను ఇకపై సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన పనిలేదు. ఆ డిపాజిట్ అవసరం లేకుండానే బస్సులను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రజలకు కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న డిపో మేనేజర్ను సంప్రదించవచ్చని సజ్జనార్ సూచించారు. లేదా 040-30102829, 040-68153333 అనే ఆర్టీసీ టోల్ ఫ్రీ నంబరలకు కూడా కాల్ చేయవచ్చని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…