Akash Puri : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ పవర్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రముఖ డైరెక్టర్ పూరీజగన్నాథ్. ఆయన కొడుకు ఆకాష్ పూరీ నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్. ఈ సినిమాను మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన తండ్రి లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
తన తండ్రి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారని.. అయితే ఆ సక్సెస్ ఆయనకు అంత ఈజీగా రాలేదని ఆకాష్ అన్నారు. ఇండస్ట్రీలో తన తండ్రి మీద వచ్చిన రూమర్స్, కామెంట్స్ ని విని తాను ఎంతో బాధకు గురయ్యానని అన్నారు. ఆకాష్ పూరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. విజయ్ దేవరకొండ వర్క్ కి ఆకాష్ పూరీ పెద్ద ఫ్యాన్ అని అన్నారు. లైగర్ సినిమా కోసం మీరు ఎంతో కష్టపడ్డారని అన్నారు.
అందుకే ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ ని సాధిస్తారని అన్నారు. రొమాంటిక్ సినిమాను ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించారని అన్నారు. ఎన్నో రోజులుగా మా నాన్న గురించి మాట్లాడాలని.. ఇప్పుడు తనకు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. నర్సీపట్నంలో పుట్టిన పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారని, కుటుంబం, బంధువులు, స్నేహితులందరి భాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించారన్నారు.
అంతా బాగుంది.. అనుకునే టైమ్ కి ఓ వ్యక్తిని నమ్మడంతో తమ జీవితం తలక్రిందులైందని అన్నారు. అయినా కూడా మహా సముద్రాన్ని ఈదినట్లు.. మమ్మల్ని సంతోషంగా చూసుకోవడానికి ఎంతో కష్టపడ్డారని అన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది పూరీ జగన్నాథ్ కెరీర్ అయిపోయింది. రొటీన్ సినిమాలే చేస్తున్నారనే టాక్ విని తానెంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు.
ఈ సినిమా సక్సెస్ తో తాను కాలర్ ఎగరేసుకున్నానని.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం అంటూ ఆకాష్ పూరీ ఎమోషనల్ అయ్యారు. అలాగే నువ్వు కూడా నన్ను చూసి గర్వపడేలా కష్టపడతానని అన్నారు. ఆ మాటలు విన్న పూరీ జగన్నాథ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆకాష్ మాటలకు ఇంప్రెస్ అయిన బండ్ల గణేష్, ఆకాష్ స్పీచ్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి గాడ్ బ్లెస్ యూ బంగారం.. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావంటూ.. విష్ చేశారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…