Trolls On Dil Raju : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏది చేసినా నెటిజన్లు ట్రోలింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ట్రోల్స్ బారిన పడి కొందరు సెలబ్రిటీలు టెంపరరీగా సోషల్ ఖాతాలను డీయాక్టివేట్ కూడా చేస్తున్నారు. గతంలో కొందరు సెలబ్రిటీలకు ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా దిల్ రాజు అనవసరంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. ఆయన భార్య తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్ 29న రాత్రి ఆమె ప్రసవించింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఎప్పుడు మ్యాటర్ దొరుకుతుందా.. ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేద్దామా.. అని ఎదురు చూస్తున్న వాళ్లకు దిల్ రాజు తండ్రి అయ్యాడన్న వార్త చెవుల్లో అమృతంలా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.
దిల్ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం విదితమే. ఆమె మొదటి భార్య సంతానం. ఆమెకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అంటే దిల్ రాజు ఆల్రెడీ తాత అయ్యారన్నమాట. ఇదే విషయాన్ని చెబుతూ కొందరు నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తాతగా ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఇదంతా అవసరమా.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అని కొందరు నెటిజన్లు అంటుండగా.. ఇంకొందరు మాత్రం ఎవరైనా సరే తండ్రి అయ్యాక తాత అవుతారు. కానీ దిల్ రాజు మాత్రం వెరైటీగా తాత అయ్యాక తండ్రి అయ్యారు.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం దిల్ రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వివాహం ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగత విషయాల్లో మన జోక్యం చేసుకోవడం ఎందుకు.. మనిషి అన్నాక తోడు అవసరం.. అందుకు వయస్సుతో పనిలేదు.. అందుకనే ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నారు.. ఇంకా ఓపిక ఉంది కాబట్టే బిడ్డను కన్నారు.. ఇందులో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది.. అంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…