Trolls On Dil Raju : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏది చేసినా నెటిజన్లు ట్రోలింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ట్రోల్స్ బారిన పడి కొందరు సెలబ్రిటీలు టెంపరరీగా సోషల్ ఖాతాలను డీయాక్టివేట్ కూడా చేస్తున్నారు. గతంలో కొందరు సెలబ్రిటీలకు ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా దిల్ రాజు అనవసరంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. ఆయన భార్య తేజస్విని అలియాస్ వైఘా రెడ్డి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే. జూన్ 29న రాత్రి ఆమె ప్రసవించింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఎప్పుడు మ్యాటర్ దొరుకుతుందా.. ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేద్దామా.. అని ఎదురు చూస్తున్న వాళ్లకు దిల్ రాజు తండ్రి అయ్యాడన్న వార్త చెవుల్లో అమృతంలా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.
దిల్ రాజుకు ఇప్పటికే ఓ కుమార్తె ఉన్న విషయం విదితమే. ఆమె మొదటి భార్య సంతానం. ఆమెకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అంటే దిల్ రాజు ఆల్రెడీ తాత అయ్యారన్నమాట. ఇదే విషయాన్ని చెబుతూ కొందరు నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తాతగా ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు ఆయనకు ఇదంతా అవసరమా.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అని కొందరు నెటిజన్లు అంటుండగా.. ఇంకొందరు మాత్రం ఎవరైనా సరే తండ్రి అయ్యాక తాత అవుతారు. కానీ దిల్ రాజు మాత్రం వెరైటీగా తాత అయ్యాక తండ్రి అయ్యారు.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే కొందరు మాత్రం దిల్ రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వివాహం ఆయన ఇష్టం. ఆయన వ్యక్తిగత విషయాల్లో మన జోక్యం చేసుకోవడం ఎందుకు.. మనిషి అన్నాక తోడు అవసరం.. అందుకు వయస్సుతో పనిలేదు.. అందుకనే ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నారు.. ఇంకా ఓపిక ఉంది కాబట్టే బిడ్డను కన్నారు.. ఇందులో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది.. అంటూ మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…