Pooja Hegde : సాధారణంగా సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ను రిపీట్ చేసి కొందరు సక్సెస్ సాధిస్తుంటారు. అయితే ఇది అనివార్య పరిస్థితుల్లోనే చేస్తారు. ఏ సినిమా తీసినా హిట్ కాకపోతే కనీసం కాంబినేషన్లో అయినా హిట్ అవుతుందేమోనని అలా చేస్తుంటారు. కానీ సహజంగానే ఏ దర్శక నిర్మాత కూడా ఒకసారి సినిమా తీసిన హీరో లేదా హీరోయిన్తో వెంట వెంటనే సినిమాలు తీయరు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన తన వరుస చిత్రాల్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్తో తీసిన అజ్ఞాత వాసి చిత్రం ఫెయిల్ అయింది. ఈక్రమంలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్తో కలిసి అరవింద సమేత చిత్రాన్ని తీశారు. అయితే ఆ మూవీలో పూజా హెగ్డెను హీరోయిన్గా తీసుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. దీంతో త్రివిక్రమ్ సెంటిమెంట్గా మళ్లీ తన సినిమాలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన అల వైకుంఠ పురములో సినిమాలోనూ పూజా హెగ్డె నటించింది. ఆ మూవీ కూడా హిట్ అయింది. దీంతో పూజా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఇతర హీరోలతో తీసిన చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో పూజాకు వరుస ఆఫర్లు వచ్చాయి.
అయితే సెంటిమెంట్ను రిపీట్ చేద్దాం అనుకున్నారో, ఏమోగానీ.. త్రివిక్రమ్ మళ్లీ తన తదుపరి మూవీలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో పూజాను త్రివిక్రమ్ హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్ర లాంచింగ్ తాజాగా హైదరాబాద్లో జరిగింది. త్వరలోనే షూటింగ్ను మొదలు పెట్టనున్నారు.
అయితే ఇలా పూజాను త్రివిక్రమ్ తన సినిమాకు తీసుకోవడం వరుసగా ఇది మూడో సారి. దీంతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని కొందరు అంటున్నారు. అలాగే కొందరు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇక మీరు పూజా హెగ్డెను వదలరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ హిట్ ను సాధిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…