Pooja Hegde : సాధారణంగా సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ను రిపీట్ చేసి కొందరు సక్సెస్ సాధిస్తుంటారు. అయితే ఇది అనివార్య పరిస్థితుల్లోనే చేస్తారు. ఏ సినిమా తీసినా హిట్ కాకపోతే కనీసం కాంబినేషన్లో అయినా హిట్ అవుతుందేమోనని అలా చేస్తుంటారు. కానీ సహజంగానే ఏ దర్శక నిర్మాత కూడా ఒకసారి సినిమా తీసిన హీరో లేదా హీరోయిన్తో వెంట వెంటనే సినిమాలు తీయరు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన తన వరుస చిత్రాల్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్తో తీసిన అజ్ఞాత వాసి చిత్రం ఫెయిల్ అయింది. ఈక్రమంలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్తో కలిసి అరవింద సమేత చిత్రాన్ని తీశారు. అయితే ఆ మూవీలో పూజా హెగ్డెను హీరోయిన్గా తీసుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. దీంతో త్రివిక్రమ్ సెంటిమెంట్గా మళ్లీ తన సినిమాలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన అల వైకుంఠ పురములో సినిమాలోనూ పూజా హెగ్డె నటించింది. ఆ మూవీ కూడా హిట్ అయింది. దీంతో పూజా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఇతర హీరోలతో తీసిన చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో పూజాకు వరుస ఆఫర్లు వచ్చాయి.
అయితే సెంటిమెంట్ను రిపీట్ చేద్దాం అనుకున్నారో, ఏమోగానీ.. త్రివిక్రమ్ మళ్లీ తన తదుపరి మూవీలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో పూజాను త్రివిక్రమ్ హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్ర లాంచింగ్ తాజాగా హైదరాబాద్లో జరిగింది. త్వరలోనే షూటింగ్ను మొదలు పెట్టనున్నారు.
అయితే ఇలా పూజాను త్రివిక్రమ్ తన సినిమాకు తీసుకోవడం వరుసగా ఇది మూడో సారి. దీంతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని కొందరు అంటున్నారు. అలాగే కొందరు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇక మీరు పూజా హెగ్డెను వదలరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ హిట్ ను సాధిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…