Pooja Hegde : సాధారణంగా సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ను రిపీట్ చేసి కొందరు సక్సెస్ సాధిస్తుంటారు. అయితే ఇది అనివార్య పరిస్థితుల్లోనే చేస్తారు. ఏ సినిమా తీసినా హిట్ కాకపోతే కనీసం కాంబినేషన్లో అయినా హిట్ అవుతుందేమోనని అలా చేస్తుంటారు. కానీ సహజంగానే ఏ దర్శక నిర్మాత కూడా ఒకసారి సినిమా తీసిన హీరో లేదా హీరోయిన్తో వెంట వెంటనే సినిమాలు తీయరు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన తన వరుస చిత్రాల్లో బుట్ట బొమ్మ పూజా హెగ్డెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్తో తీసిన అజ్ఞాత వాసి చిత్రం ఫెయిల్ అయింది. ఈక్రమంలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్తో కలిసి అరవింద సమేత చిత్రాన్ని తీశారు. అయితే ఆ మూవీలో పూజా హెగ్డెను హీరోయిన్గా తీసుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. దీంతో త్రివిక్రమ్ సెంటిమెంట్గా మళ్లీ తన సినిమాలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన అల వైకుంఠ పురములో సినిమాలోనూ పూజా హెగ్డె నటించింది. ఆ మూవీ కూడా హిట్ అయింది. దీంతో పూజా గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఇతర హీరోలతో తీసిన చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. దీంతో పూజాకు వరుస ఆఫర్లు వచ్చాయి.
అయితే సెంటిమెంట్ను రిపీట్ చేద్దాం అనుకున్నారో, ఏమోగానీ.. త్రివిక్రమ్ మళ్లీ తన తదుపరి మూవీలో పూజా హెగ్డెనే తీసుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో పూజాను త్రివిక్రమ్ హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్ర లాంచింగ్ తాజాగా హైదరాబాద్లో జరిగింది. త్వరలోనే షూటింగ్ను మొదలు పెట్టనున్నారు.
అయితే ఇలా పూజాను త్రివిక్రమ్ తన సినిమాకు తీసుకోవడం వరుసగా ఇది మూడో సారి. దీంతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని కొందరు అంటున్నారు. అలాగే కొందరు మాత్రం ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇక మీరు పూజా హెగ్డెను వదలరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ హిట్ ను సాధిస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…