Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్ర చందనం చెట్లను నరికే కూలీగా జీవితాన్ని ప్రారంభించి చివరకు వాటిని అమ్మే లీడర్ స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే సినిమాలో పుష్ప రాజ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ చివరకు స్మగ్లింగ్ గ్యాంగ్కు లీడర్ అవుతాడు.
ఈ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధాన అంశంగా ఉంటుంది. పుష్ప రాజ్ ఎర్ర చందనాన్ని అనేక విధాలుగా స్మగ్లింగ్ చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా అత్యంత చాకచక్యంగా ఎర్ర చందనం లోడ్లను చెక్ పోస్టులను దాటిస్తాడు. అయితే దీన్నే ప్రేరణగా తీసుకున్న ఓ వ్యక్తి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయబోయాడు. చివరకు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రూ.2.50 కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలను లారీ వేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు గాను పుష్ప సినిమాలోలాగా.. లారీలో పైన కూరగాయలను పెట్టాడు. వాటి కింద ఎర్ర చందనం కలపను ఉంచాడు. ఈ క్రమంలోనే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే మొదట వారికి అనుమానం కలగలేదు. కానీ ఎందుకైనా మంచిదని లారీ మొత్తాన్ని మళ్లీ తనిఖీ చేశారు. దీంతో చివరకు అందులో ఎర్ర చందనం కలప పట్టుబడింది. ఈ క్రమంలో ఆ కలపను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అయితే పుష్ప సినిమాపై ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు తాజాగా విమర్శలు చేశారు. స్మగ్లింగ్ను గొప్పగా చూపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆ సినిమా చూసి సమాజం చెడిపోతే అందుకు ఎవరు బాధ్యత వహించాలని అన్నారు. అలా ఆయన అన్న తరువాతే పైన తెలిపిన సంఘటన జరగడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…