Tollywood : ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గాడిన పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తుండడంతో వచ్చేనెల నుంచి పెద్ద ఎత్తున భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి సమయంలోనే అనుకోని విధంగా పిడుగులాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంత ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి.
ఇప్పటికే ఈ వేరియంట్ గురించి అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వైరస్ కనుక ఇండియాలో వ్యాప్తి చెందితే ఈ ప్రభావం తప్పనిసరిగా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతుందని తెలుస్తోంది. కరోనా రెండవ దశలో భాగంగా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ భయాందోళనల నుంచి బయట పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.
ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్యనిపుణులు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇక ఈ వేరియంట్ కేసులు కనుక తెలుగు రాష్ట్రాలలో నమోదయితే మరోసారి టాలీవుడ్ పై కోలుకోలేని దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఇవన్నీ సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒమిక్రాన్ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. మరి ఈ వేరియంట్ ప్రభావం టాలీవుడ్ పై ఏవిధంగా ఉండబోతోంది.. అనే విషయం కొద్ది రోజులలో తెలియనుంది. డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా విడుదల కానుండడంతో.. ఈ మూవీ కలెక్షన్లపై ఒమిక్రాన్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై కూడా త్వరలో ఏ విషయమూ తేలనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…