Tollywood : సినీ పరిశ్రమ పెద్దలు కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు నేటి నుండి ఏపీలోని థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సినీ పరిశ్రమకు కాస్త ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరపగా, ఎట్టకేలకు దీనిపై సానుకూల స్పందన వచ్చింది.
కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మహా సముద్రం చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన చిత్ర బృందానికి ఆనందం కలిగిస్తోంది. దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తాజా ఆదేశాల్లో తెలిపింది. దీంతో సెకండ్ షో సినిమాకు కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…