Tollywood : కరోనా మొదటి వేవ్.. ఆ తరువాత రెండో వేవ్.. రెండింటి మూలంగా అనేక రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. వాటిల్లో సినీ రంగం కూడా ఒకటి. చాలా చిత్రాలు నిర్మాణ దశలో ఆగిపోగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వద్ద నిలిచాయి. కొన్ని విడుదలకు సిద్ధమయ్యాయి. అలాంటి సమయాల్లో కరోనా రెండు దశలు వచ్చి నాశనం చేశాయి. దీంతో సినిమాలను ఏదో ఒక విధంగా పూర్తి చేసి చాలా మంది నిర్మాతలు ఓటీటీలకు ఇచ్చేశారు. నష్టాలను తగ్గించుకున్నారు.
అయితే అంతా బాగానే ఉంది, సద్దుమణుగుతోంది.. అనుకుంటున్న తరుణంలో టాలీవుడ్ను మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38 దేశాల్లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కోవిడ్ మూడో దశ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పేరు చెబితేనే టాలీవుడ్ భయపడుతోంది.
ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియెంట్ ప్రభావం అంతగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేస్తున్నారు. అయితే ముందు ముందు కేసులు పెరిగితే ముందుగా స్కూళ్లు, సినిమా థియేటర్లపైనే వేటు పడుతుంది. కనుక రానున్న రోజుల్లో పెరిగే కేసుల సంఖ్యపై టాలీవుడ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. కేసుల సంఖ్య పెరిగితే గనక కచ్చితంగా ఆంక్షలను విధిస్తారు. అప్పుడు ముందుగా మూత పడేది థియేటర్లేనని చెప్పవచ్చు. దీంతో టాలీవుడ్కు మరోమారు కరోనా భయం పట్టుకుందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికప్పుడు జరిగే నష్టం ఏమీ లేకపోయినా.. కోవిడ్ మూడో వేవ్ వచ్చి థియేటర్లు మూత పడితే పెద్ద సినిమాలకు చాలా నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ డేట్స్ను కూడా ప్రకటించేశారు. ఈ తరుణంలో థియేటర్లు మూత పడితే సినిమాలను మళ్లీ వాయిదా వేయాల్సి వస్తుంది. ఆ తరువాత 6 నెలలకు గానీ మూడో వేవ్ తగ్గే అవకాశం ఉండదు. అప్పటికి మరిన్ని సినిమాలకు విడుదలకు సిద్ధమవుతాయి. దీంతో సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అప్పుడు థియేటర్లు దొరకవు. దీంతో అది కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మూడో వేవ్ రావొద్దనే టాలీవుడ్ కోరుకుంటోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…