Tollywood : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌజ్లో ఒకటిగా ఉంది మైత్రి మూవీ మేకర్స్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్న ఈ నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని రెండు పార్ట్స్గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. అంటే ఈ సినిమా మరో నెల రోజులలో విడుదల కానుంది.
ఇప్పటి వరకు చిత్రం నుండి దాక్కో దాక్కో మేక, చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే, సామీ సామీ సాంగ్ లను రిలీజ్ చేశారు. ఈ పాటలు శ్రోతలను అలరించాయి. అయితే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇంత వరకు టీజర్ ను విడుదల చేయలేదు, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ లేదు, సినిమా నుండి వరుస లీకులు వస్తున్నాయి, ప్రమోషన్స్ సరిగా లేవు.. వీటన్నింటిని చూసి విసిగిపోయిన నెటిజన్స్ సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నిప్పులు చెరుగుతున్నారు.
#UnworthyProductionMythri అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ ట్రెండ్ చేయగా, ఇప్పుడు ఇది ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికైనా మైత్రి మూవీ మేకర్స్ మేల్కొని త్వరగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని అంటున్నారు. కాగా, పుష్ప సినిమా హిందీ థియేట్రికల్ రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా, ఈ విషయం మీద రకరకాల కథనాలు ప్రచారం జరుగుతుండగా అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…