Tiger Nageshwar Rao : బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా గుర్తుంది కదా. ఆ మూవీ రెండు పార్ట్లుగా రిలీజ్ అయింది. ఒకటి ఎన్టీఆర్ సినిమాల గురించి కాగా.. ఇంకొకటి రాజకీయాల గురించి ఉంటుంది. బాలకృష్ణ ఆ మూవీల్లో ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే అదే సమయంలో వాస్తవాలను చెబుతున్నాం.. అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ మూవీని తెరకెక్కించారు.
అయితే బాలకృష్ణ తీసిన రెండు సినిమాలు ఏమో గానీ.. వర్మ తీసిన సినిమాకే మంచి పాపులారిటీ దక్కిందని చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ఒకే సమయంలో ఒకే కథతో రెండు భిన్న సినిమాలు రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఇక తాజాగా అలాంటి విచిత్రమే జరుగుతుందని చెప్పవచ్చు.
స్టువర్ట్పురంలో ప్రజలచే నాయకుడిగా కీర్తించబడి.. పోలీసులకు దొరకకుండా వారికి ముచ్చెమటలు పట్టించిన టైగర్ నాగేశ్వర్ రావు.. జీవిత చరిత్రతో మాస్ మహరాజ రవితేజ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీని అనౌన్స్ చేసి ఒక్క రోజు కూడా కాకముందే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అదే టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ పేరిట ఇంకో మూవీని అనౌన్స్ చేశారు. ఆ మూవీని స్టూవర్ట్ పురం దొంగ పేరిట తెరకెక్కిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైగర్ నాగేశ్వర్ రావు పాత్రను పోషించనున్నాడు.
అయితే ఇలా ఒకే వ్యక్తి బయోపిక్ను ఇద్దరు హీరోలు రెండు వేర్వేరు సినిమాలుగా తీస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా మూవీలను అనౌన్స్ చేశారా.. లేదైనా ఇంకేదైనా కారణం ఉందా.. అన్న వివరాలు తెలియవు కానీ.. ఇద్దరూ తీస్తున్నది టైగర్ నాగేశ్వర్ రావు గురించే కావడం విశేషం.
ఈ క్రమంలోనే స్టూవర్ట్ పురం దొంగలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్ను దీపావళి సందర్బంగా రివీల్ చేశారు. అందులో సాయిశ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఇక రవితేజ లుక్ను కూడా రివీల్ చేయాల్సి ఉంది. మరి కథ ఒకటే అయినా.. ఇద్దరిలో ఎవరి మూవీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తుందో చూడాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…