Anchor Suma : దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది తమ కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కోల్పోయారు. కరోనా పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది.
సెలబ్రిటీలు కూడా అనేక మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక సీనియర్ నటి వరలక్ష్మి తన వాళ్లు కరోనా వల్ల ఎలా చనిపోయారో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఆమె క్యాష్ షోలో గెస్టుగా పాల్గొన్నారు. ఈ షో నవంబర్ 6 నుంచి ప్రసారం కానుంది. ఈ షోకు ఆమని, యమున, దివ్య వాణి, వరలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్బంగా వరలక్ష్మి తన బాధను చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన విషయాలను విన్న తోటి కంటెస్టెంట్లు, యాంకర్ సుమ.. సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కరోనా వల్ల తన ఫ్యామిలీలో ఏకంగా 5 మంది చనిపోయారిన వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చెల్లెలు సరస్వతికి, ఆమె భర్తకు కరోనా వచ్చిందని, కానీ ఆయన చనిపోయారని, అయితే అదృష్టవశాత్తూ తన చెల్లెలు సరస్వతిని కష్టపడి బతికించుకున్నామని తెలిపారు. ఆ సమయంలో ఎవరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉందని, దీంతో తన చెల్లి ఒక్కతే ఆమె భర్త మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిందని, ఈ కష్టం ఎవరికీ రాకూడదని అనిపించిందని వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అందరికీ ఆమె చెప్పిన విషయాలు కంటతడి పెట్టించాయి. కాగా ఈ షోకు చెందిన ప్రోమో వీడియో వైరల్గా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…