Shruti Haasan : రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించిన శృతి హాసన్కు బాలకృష్ణ పక్కన నటించే చాన్స్ వచ్చిందని గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒత్తిడి మేరకే శృతి హాసన్ బాలయ్య పక్కన నటించేందుకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. ముందుగా ఆమె బాలయ్య పక్కన నటించేందుకు అంగీకరించలేదట. కానీ గోపీచంద్ మలినేని చొరవ వల్ల ఆమె బాలయ్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే ఈ వార్తలు నిజమే అయ్యాయి.
బాలకృష్ణ ఎన్బీకే 107 ప్రాజెక్టులో శృతి హాసన్ నటిస్తుందంటూ మైత్రి మూవీ మేకర్స్ దీపావళి సందర్భంగా ప్రకటన చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. బాలయ్య సరసన శృతి హాసన్ నటించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ను, శృతి హాసన్ను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో బాలయ్య సరసన శృతి హాసన్ ఏ పాత్రలో నటిస్తుంది ? కొంపదీసి బాలయ్యకు కూతురుగా నటించడం లేదు కదా.. ఇదేమి దిక్కుమాలిన కాంబినేషన్ రా బాబూ.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమెను హీరోయిన్గా అనౌన్స్ చేసిన వెంటనే ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతోంది. మరి సినిమా తీశాక అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
బాలయ్య స్వతహాగా కోపంగానే ఉంటారు, కనుక ఆయన పక్కన చేసేందుకు శృతి మొదట భయపడిందట. కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని సర్దిచెప్పడంతో ఆమె నటించేందుకు ఒప్పుకుందట. ఏది ఏమైనా.. బాలయ్య పక్కన శృతి హాసన్ అంటే.. ఇది వెరైటీ కాంబినేషన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…