T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 35వ మ్యాచ్లో వెస్టిండీస్పై శ్రీలంక గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ వెనుకబడింది. ఎంతో శ్రమించినా విండీస్ టార్గెట్ను అందుకోలేకపోయింది. దీంతో విండీస్పై లంక జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లంక బ్యాట్స్మెన్లలో చరిత్ అసలంక 68 పరుగులతో చెలరేగిపోగా, పతుమ్ నిస్సంక 51 పరుగులు, కుశాల్ పెరీరా 29, దసున్ శనక 25 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఆండ్రె రస్సెల్ 2 వికెట్లు తీశాడు. డ్వానె బ్రేవోకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షిమ్రాన్ హిట్మైర్ 81 పరుగులు చేసి రాణించగా, నికోలాస్ పూరన్ 46 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో బినురా ఫెర్నాండో, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ డిసిల్వలు తలా 2 వికెట్లు తీశారు. దుష్మంత చమీరా, దసున్ శనక చెరొక వికెట్ తీశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…