T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 35వ మ్యాచ్లో వెస్టిండీస్పై శ్రీలంక గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ వెనుకబడింది. ఎంతో శ్రమించినా విండీస్ టార్గెట్ను అందుకోలేకపోయింది. దీంతో విండీస్పై లంక జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లంక బ్యాట్స్మెన్లలో చరిత్ అసలంక 68 పరుగులతో చెలరేగిపోగా, పతుమ్ నిస్సంక 51 పరుగులు, కుశాల్ పెరీరా 29, దసున్ శనక 25 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఆండ్రె రస్సెల్ 2 వికెట్లు తీశాడు. డ్వానె బ్రేవోకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షిమ్రాన్ హిట్మైర్ 81 పరుగులు చేసి రాణించగా, నికోలాస్ పూరన్ 46 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో బినురా ఫెర్నాండో, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ డిసిల్వలు తలా 2 వికెట్లు తీశారు. దుష్మంత చమీరా, దసున్ శనక చెరొక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…