T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 35వ మ్యాచ్లో వెస్టిండీస్పై శ్రీలంక గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ వెనుకబడింది. ఎంతో శ్రమించినా విండీస్ టార్గెట్ను అందుకోలేకపోయింది. దీంతో విండీస్పై లంక జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లంక బ్యాట్స్మెన్లలో చరిత్ అసలంక 68 పరుగులతో చెలరేగిపోగా, పతుమ్ నిస్సంక 51 పరుగులు, కుశాల్ పెరీరా 29, దసున్ శనక 25 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఆండ్రె రస్సెల్ 2 వికెట్లు తీశాడు. డ్వానె బ్రేవోకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షిమ్రాన్ హిట్మైర్ 81 పరుగులు చేసి రాణించగా, నికోలాస్ పూరన్ 46 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో బినురా ఫెర్నాండో, చమిక కరుణరత్నె, వనిందు హసరంగ డిసిల్వలు తలా 2 వికెట్లు తీశారు. దుష్మంత చమీరా, దసున్ శనక చెరొక వికెట్ తీశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…