Pigeons : సాధారణంగా మనుషులకే కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. కొందరు తాము పెంచుకునే జంతువులకు ఆస్తులను రాస్తుంటారు. అయితే పక్షులకు ఆస్తి ఉండడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే.. నిజంగానే షాకవుతారు. అక్కడి పావురాళ్లకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే వాటిని ఏ ధనికుడో పెంచుకోరు. అవి అక్కడ స్వతంత్రంగానే జీవిస్తాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రాజస్థాన్లోని నగౌర్ జిల్లా జాస్నగర్ అనే చిన్న టౌన్లో అనేక పావురాళ్లు నివాసం ఉంటున్నాయి. వాటికి అక్కడి వారు కచ్చితంగా ఆహారం, నీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అవి అక్కడ కోటీశ్వరురాళ్లు మరి. 4 దశాబ్దాల కిందట పారిశ్రామిక వేత్త సజ్జన్రాజ్ జైన్ ఆర్థిక సహకారంతో అక్కడి సర్పంచ్ రామ్దిన్ చోటియా, ఆయన గురువు మరుధర్ కేసరిలు పావురాళ్ల కోసం కబూతరన్ ట్రస్ట్ పేరిట ఓ ట్రస్ట్ను నెలకొల్పారు. ఈ ట్రస్ట్ కు అప్పట్లో విశేష ఆదరణ లభించింది. దీంతో ప్రజలు విరివిగా విరాళాలను అందజేశారు. దీంతో అక్కడి పావురాళ్ల సంఖ్య ఎక్కువైంది.
ఈ క్రమంలోనే వారు ఆ ట్రస్ట్కు వచ్చిన సొమ్ముతో గోశాలను ఏర్పాటు చేసి అందులో ఆవులను పెంచడం మొదలు పెట్టారు. క్రమ క్రమంగా దాంతో ఆదాయం వచ్చింది. అలాగే విరాళాలు కూడా వస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికంగా 126 బిగాల భూమిని కొని అందులో 27 షాపులను ఏర్పాటు చేసి రెంట్కు ఇచ్చారు. వాటికి నెలకు రూ.80వేల వరకు ఆదాయం వస్తోంది.
అలా అలా ఆ ట్రస్ట్ పెద్దదైంది. ఈ క్రమంలోనే అక్కడి పావురాళ్లకు ఉన్న ఆస్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడ 400 గోశాలలు ఉన్నాయి. 27 షాపుల ద్వారా ఆదాయం వస్తోంది. రూ.30 లక్షల మేర ఆ పావురాళ్లకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఇలా వాటి సంఖ్య పెరగడంతోపాటు వాటి ఆదాయం, ఆస్తులు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఆ పావురాళ్లకు స్థానికులు కచ్చితంగా నీరు, ఆహారం ఇస్తారు. ఈ క్రమంలోనే ఆ పావురాళ్లకు వస్తున్న ఆదాయంతో అక్కడి గోశాలలను నిర్వహిస్తున్నారు. ఇలా ఆ పావురాళ్లు పాపులర్ అయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…