Huge Lock : అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిర నిర్మాణం కొనసాగుతున్న విషయం విదితమే. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులు ఇచ్చిన విరాళాలతో సర్వాంగ సుందరంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మందిరం కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు ఏకంగా 400 కిలోల బరువు ఉండే తాళాన్ని రూపొందించాడు.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ (65) తాళాల వ్యాపారం చేస్తుంటాడు. అడిగిన వారికి తాళాలను తయారు చేసి ఇస్తుంటాడు. వారికి ఈ వృత్తి తరతరాల నుంచి వస్తోంది. తాను కూడా ఇదే వృత్తిలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్మాణమవుతున్న రామమందిరం కోసం సత్యప్రకాష్ శర్మ తన భార్య రుక్మని శర్మతో కలిసి 400 కిలోల బరువు ఉండే భారీ తాళాన్ని తయారు చేశాడు.
ఇక ఆ తాళాన్ని తెరిచేందుకు అవసరం అయిన తాళం చెవిని ఏకంగా 30 కిలోల బరువుతో తయారు చేశాడు. ఈ క్రమంలోనే తాళం మీద శ్రీరాముడి బొమ్మ వచ్చేలా తయారు చేశాడు. అందుకు గాను అతనికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది.
ఇక తాళం, చెవి తుప్పు పట్టకుండా ఉండేందుకు గాను స్టీల్తోపాటు ఇత్తడిని కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాళాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసేందుకు మరికొంత కాలం సమయం పడుతుందని, అయితే తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, ఎవరైనా దాతలు విరాళంగా ఇస్తే తాళం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రామ మందిరానికి ఇస్తానని చెబుతున్నాడు.
ఇక సత్యప్రకాష్ శర్మ గతేడాది కూడా 300 కిలోల బరువు ఉండే ఓ తాళాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. త్వరలో రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్లో తన తాళం నమూనాలను ప్రదర్శించాలని చూస్తున్నాడు. అలాగే భారీ తాళాలను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాలని కూడా అతను కోరుకుంటున్నాడు. అతని కలలు సాకారం కావాలని కోరుకుందాం.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…