Huge Lock : అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిర నిర్మాణం కొనసాగుతున్న విషయం విదితమే. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భక్తులు ఇచ్చిన విరాళాలతో సర్వాంగ సుందరంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మందిరం కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ భక్తుడు ఏకంగా 400 కిలోల బరువు ఉండే తాళాన్ని రూపొందించాడు.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ (65) తాళాల వ్యాపారం చేస్తుంటాడు. అడిగిన వారికి తాళాలను తయారు చేసి ఇస్తుంటాడు. వారికి ఈ వృత్తి తరతరాల నుంచి వస్తోంది. తాను కూడా ఇదే వృత్తిలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్మాణమవుతున్న రామమందిరం కోసం సత్యప్రకాష్ శర్మ తన భార్య రుక్మని శర్మతో కలిసి 400 కిలోల బరువు ఉండే భారీ తాళాన్ని తయారు చేశాడు.
ఇక ఆ తాళాన్ని తెరిచేందుకు అవసరం అయిన తాళం చెవిని ఏకంగా 30 కిలోల బరువుతో తయారు చేశాడు. ఈ క్రమంలోనే తాళం మీద శ్రీరాముడి బొమ్మ వచ్చేలా తయారు చేశాడు. అందుకు గాను అతనికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది.
ఇక తాళం, చెవి తుప్పు పట్టకుండా ఉండేందుకు గాను స్టీల్తోపాటు ఇత్తడిని కూడా ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాళాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసేందుకు మరికొంత కాలం సమయం పడుతుందని, అయితే తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, ఎవరైనా దాతలు విరాళంగా ఇస్తే తాళం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రామ మందిరానికి ఇస్తానని చెబుతున్నాడు.
ఇక సత్యప్రకాష్ శర్మ గతేడాది కూడా 300 కిలోల బరువు ఉండే ఓ తాళాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. త్వరలో రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్లో తన తాళం నమూనాలను ప్రదర్శించాలని చూస్తున్నాడు. అలాగే భారీ తాళాలను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాలని కూడా అతను కోరుకుంటున్నాడు. అతని కలలు సాకారం కావాలని కోరుకుందాం.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…