Karthikeya 2 : నిఖిల్ సిద్దార్థ్ – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది.
అయితే ఇటీవల హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారని, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని బలవంతం చేశారంటూ ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ ఇలా అనడంతో ఇండస్ట్రీలోని వారంతా షాక్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది కార్తికేయ 2. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కార్తికేయ 2 ఆపడానికి ప్రయత్నించింది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అక్కినేని నాగార్జున, హీరో నితిన్.. నిఖిల్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా రిలీజ్ చేద్దామనుకున్న టైంకి హీరో నితిన్ తన మాచర్ల నియోజకవర్గంను రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ఇద్దరు హీరోలే నిఖిల్ సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేశారని.. నిఖిల్ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలిసి కార్తికేయ 2ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు.. అంటూ నాగార్జునను, హీరో నితిన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిఖిల్ అభిమానులు. అయితే దీనిపై ఆయా హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…