Karthikeya 2 : నిఖిల్ సిద్దార్థ్ – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది.
అయితే ఇటీవల హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారని, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని బలవంతం చేశారంటూ ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ ఇలా అనడంతో ఇండస్ట్రీలోని వారంతా షాక్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది కార్తికేయ 2. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కార్తికేయ 2 ఆపడానికి ప్రయత్నించింది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అక్కినేని నాగార్జున, హీరో నితిన్.. నిఖిల్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా రిలీజ్ చేద్దామనుకున్న టైంకి హీరో నితిన్ తన మాచర్ల నియోజకవర్గంను రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ఇద్దరు హీరోలే నిఖిల్ సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేశారని.. నిఖిల్ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలిసి కార్తికేయ 2ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు.. అంటూ నాగార్జునను, హీరో నితిన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిఖిల్ అభిమానులు. అయితే దీనిపై ఆయా హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…