Karthikeya 2 : నిఖిల్ సిద్దార్థ్ – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది.
అయితే ఇటీవల హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారని, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని బలవంతం చేశారంటూ ఎమోషనల్ అయ్యాడు. నిఖిల్ ఇలా అనడంతో ఇండస్ట్రీలోని వారంతా షాక్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది కార్తికేయ 2. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కార్తికేయ 2 ఆపడానికి ప్రయత్నించింది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అక్కినేని నాగార్జున, హీరో నితిన్.. నిఖిల్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా రిలీజ్ చేద్దామనుకున్న టైంకి హీరో నితిన్ తన మాచర్ల నియోజకవర్గంను రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ఇద్దరు హీరోలే నిఖిల్ సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేశారని.. నిఖిల్ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలిసి కార్తికేయ 2ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు.. అంటూ నాగార్జునను, హీరో నితిన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిఖిల్ అభిమానులు. అయితే దీనిపై ఆయా హీరోలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…