30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు.. పృథ్వి. ఖడ్గం సినిమాలో ఆయన చెప్పిన ఈ డైలాగ్ ని తెలుగులో ఎంతో మంది నటులు కూడా అనుకరించి కామెడీని పండించేవారంటే అతిశయోక్తి కాదు. అయితే 2019 లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో పృథ్వికి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చూసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ గా నియమించారు.
కానీ ఆయన ఆ పదవి చేపట్టిన కొద్ది రోజులకే.. మహిళలతో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో ఆయన ఆ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు నోరు జారి మాట్లాడటం, పవన్ కల్యాణ్ని, ఆయన అభిమానులను, మెగా ఫ్యామిలీని తీవ్రంగా విమర్శించడం వల్ల ఆయన సినీ కెరీర్ లో పూర్తిగా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయాయి. దీంతో ఆయన కెరీర్ కే ప్రమాదం వచ్చి పడింది.
కానీ ఈ మధ్య ఈయన నటుడు నాగబాబుని కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో పృథ్వికి మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం వల్ల ఆ రిలేషన్ తనకు సినిమా ఛాన్సులను తెచ్చి పెడుతుందని పృథ్వి అనుకుంటున్నారట. దీంతో ఇబ్బందుల్లో ఉన్న తన మూవీ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని పృథ్వి నమ్ముతున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకోసమే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
కానీ పృథ్వి జనసేన పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారో చూడాలి. లైంగిక వేధింపుల ఆరోపణలతో మంచి పేరు, సినీ కెరీర్, పదవి పోగొట్టుకున్న ఆయనని పార్టీలో చేర్చుకోవడం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. జనసేన అభిమానులు వ్యతిరేకిస్తున్నారట. దీంతో పృథ్వి జనసేనలో చేరడం కొందరికి నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే జనసేనలో చేరాక పృథ్వి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…