ఆది, చెన్న కేశవరెడ్డి, దిల్, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వి.వి.వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం రాలేదు. ఆ మధ్య విడుదలైన ఖైదీ 150 హిట్ అయినా, ఇంటిల్లిజెంట్ అయినంతగా ఆకట్టుకోలేదు. ఆది వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన వినాయక్ ఆ తరువాత వెంటనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశారు. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
తాజాగా చెన్నకేశవరెడ్డి సినిమా విశేషాలను దర్శకుడు వి.వి.వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రొడ్యూసర్ బెల్లకొండ సురేష్ ద్వారా బాలకృష్ణకు కథ చెప్పగానే ఒకే చేశారని, స్టోరీ ఒకే చేసిన ఒక వారంలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టామన్నారు. ఈ సినిమా ద్వారా ఓ పెద్ద హీరోను హ్యాండిల్ చేయగలనని తనకు మంచి పేరు వచ్చిందన్నారు. అయితే తాను బాలకృష్ణను ఓ రేంజ్లో చూపించాలనే ఆలోచనతో కథ మీద ఫోకస్ తగ్గిందేమో అనిపించిందన్నారు.
ఈ సినిమాలో టబు చేసిన క్యారెక్టర్కు మొదట సౌందర్యని అనుకున్నాం. బెంగుళూరుకు వెళ్లి స్టోరీ కూడా చెప్పాం. ఇందులో యంగ్, ఓల్డ్ రెండు పాత్రలు ఉంటాయని చెప్పాం.. కానీ అప్పుడే ఓల్డ్ క్యారెక్టర్లు వద్దు వినయ్ గారు అని సౌందర్య తిరస్కరించారు. నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా సౌందర్యతో నాలుగైదు సినిమాలు చేశా. ఇక ఎవరిని తీసుకుందామని అనుకుంటూ ఉండగా.. టబు గుర్తొచ్చారు. వెంటనే ఆమెను కలిస్తే ఒప్పుకున్నారు. శ్రియను తీసుకోవాలని మేము ముందుగానే అనుకున్నాం.. అని వి.వి.వినాయక్ అప్పటి సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…