Nagarjuna : నాగార్జున‌, ఆయ‌న మొద‌టి భార్య ల‌క్ష్మి.. అందుక‌నే విడిపోయారా.. అస‌లు కార‌ణం అదే..!

Nagarjuna : యువ సామ్రాట్‌గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల‌తో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్ద‌రు కొడుకులు ఉండి తాత అయ్యే వ‌య‌స్సు ఆయ‌న‌కు ఉన్నా.. ఆయ‌న ఇంకా యువ‌కుడిలానే క‌నిపిస్తుంటాడు. దీంతో నాగార్జున‌ను అంద‌రూ న‌వ మ‌న్మ‌థుడు అని పిలుస్తుంటారు. అయితే నాగార్జున మొద‌టి భార్య ద‌గ్గుబాటి ల‌క్ష్మి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ త‌రువాత ఆయ‌న ఆమెకు విడాకులు ఇచ్చి అమ‌లను చేసుకున్నారు. అయితే ల‌క్ష్మితో ఆయ‌న విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. కానీ దీనికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అప్ప‌ట్లో ద‌గ్గుబాటి రామానాయుడుకు, అక్కినేని నాగేశ్వ‌ర్ రావుకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. దీంతో రామానాయుడు త‌న కుమార్తె ల‌క్ష్మిని నాగేశ్వ‌ర్ రావు కుమారుడు నాగార్జున‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని అనుకున్నారు. అదే విష‌యాన్ని ఆయ‌న ఏఎన్నార్‌కు చెప్ప‌గా.. అందుకు ఆయ‌న కూడా స‌రే అన్నారు. దీంతో అమెరికాలో ఉన్న ల‌క్ష్మిని ఇండియాకు ర‌ప్పించారు. అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేశారు. అయితే ల‌క్ష్మికి వాస్త‌వానికి ఇండియాకు రావ‌డం ఇష్టం లేద‌ట‌. వివాహం అయినా అమెరికాలోనే ఉండాల‌ని ఆమె కోరిక‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమె ఇదే విష‌యాన్ని నాగార్జున‌కు చెప్పింద‌ట‌.

Nagarjuna

అయితే నాగార్జున అప్ప‌టికే తెలుగులో హీరోగా ఫుల్ స‌క్సెస్ బాట‌లో ఉన్నాడు. దీంతో ఆయ‌న అమెరికా వెళ్లేందుకు ఇష్ట‌ప‌డలేదు. ఫ‌లితంగా ల‌క్ష్మి, నాగార్జున మ‌ధ్య గొడ‌వ‌లు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే వారు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు అయ్యే స‌మ‌యానికే వారికి చైత‌న్య జ‌న్మించాడు. ఈ క్ర‌మంలోనే చైతూ త‌ల్లి ద‌గ్గ‌ర చెన్నైలోనే పెరిగాడు. అయిన‌ప్ప‌టికీ చైతూ సెల‌వుల‌కు హైద‌రాబాద్‌కు వ‌స్తుండేవాడు. దీంతో అప్ప‌టికే వివాహం అయి ఉన్న అమ‌ల కుమారుడు అఖిల్‌తో క‌లిసి చైతూ సెల‌వుల్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. త‌రువాత చెన్నైకి వెళ్లిపోయాడు. ఇక జోష్ మూవీ ద్వారా హీరోగా పరిచ‌యం అయిన చైతూ అప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లోనే ఉంటున్నాడు. ఆ త‌రువాత స‌మంతను చేసుకుని వేరే కాపురం పెట్టాడు. కానీ ఆమెకు విడాకులు ఇచ్చాక ఒక్క‌డే వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఇలా ల‌క్ష్మికి జ‌రిగిన‌ట్లే చైతూను కూడా విడాకులు వెంటాడ‌డం అంద‌రినీ ఇప్పటికీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM