Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది.
నసీబ్ సినిమాలోని ఒక పాటలో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరోస్ అందరూ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించి బాలీవుడ్ లో అలరించారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే టాప్ హీరోస్ ఒక పాటలో కనిపించాలని నిర్మాత సుబ్బిరామిరెడ్డి భావించి 7 మంది హీరోలను, 4 మంది హీరోయిన్స్ తో మాట్లాడి ఒప్పించారట. త్రిమూర్తులు చిత్రంలో ఒకే పాటలో ప్రముఖ స్టార్స్ అందరూ కనిపించిన ఆ పాటే.. ఒకే మాట, ఒకే బాట.. మతం లేదు.. కులం లేదు.. అనే పాట. ఈ పాటలో వెంకటేష్ తోపాటు శోభన్బాబు, విజయశాంతి, కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, రాధిక, కృష్ణం రాజు, రాధ, మురళీ మోహన్, శారద, బాలకృష్ణ, భానుప్రియ, నాగార్జున, సుమలత, చంద్రమోహన్, జయమాలిని లు కనిపిస్తారు.
మొదటగా ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను సంప్రదించగా వారు కొన్ని కారణాల రీత్యా రాలేమని చెప్పారట. వారి స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జునలు వచ్చి ఈ పాటలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో కేవలం ఈ పాటను చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారట.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…