Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది.
నసీబ్ సినిమాలోని ఒక పాటలో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరోస్ అందరూ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించి బాలీవుడ్ లో అలరించారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే టాప్ హీరోస్ ఒక పాటలో కనిపించాలని నిర్మాత సుబ్బిరామిరెడ్డి భావించి 7 మంది హీరోలను, 4 మంది హీరోయిన్స్ తో మాట్లాడి ఒప్పించారట. త్రిమూర్తులు చిత్రంలో ఒకే పాటలో ప్రముఖ స్టార్స్ అందరూ కనిపించిన ఆ పాటే.. ఒకే మాట, ఒకే బాట.. మతం లేదు.. కులం లేదు.. అనే పాట. ఈ పాటలో వెంకటేష్ తోపాటు శోభన్బాబు, విజయశాంతి, కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, రాధిక, కృష్ణం రాజు, రాధ, మురళీ మోహన్, శారద, బాలకృష్ణ, భానుప్రియ, నాగార్జున, సుమలత, చంద్రమోహన్, జయమాలిని లు కనిపిస్తారు.
మొదటగా ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను సంప్రదించగా వారు కొన్ని కారణాల రీత్యా రాలేమని చెప్పారట. వారి స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జునలు వచ్చి ఈ పాటలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో కేవలం ఈ పాటను చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారట.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…