Dhanush : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో దేన్ని నమ్మాలో.. దేన్ని నమ్మవద్దో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అందులో వస్తున్న వార్తల్లో చాలా వరకు పుకార్లే ఉంటున్నాయి. అయితే కొన్ని వార్తలు మాత్రం నిజమే అవుతున్నాయి. కానీ 99 శాతం వరకు వార్తలు అన్నీ పుకార్లే అవుతున్నాయి. ఇక ఈమధ్యే ఓ వార్త కూడా ఇలాగే వైరల్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ఆమె మాజీ భర్త ధనుష్ మళ్లీ కలవబోతున్నారంటూ.. ఓ వార్త వైరల్ అయింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తేలింది.
ఓ మీడియా సంస్థ ఇదే విషయమై ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లను క్లారిటీ కోసం సంప్రదించిందట. దీంతో వారి మేనేజర్లు రిప్లై ఇచ్చారట. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని, విడాకులను రద్దు చేసుకుంటారని.. వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ వార్తలను నమ్మొద్దని కోరారు. అయితే ధనుష్, ఐశ్వర్య ఈ మధ్య కలసి మాట్లాడుకున్న మాట వాస్తవమేనట. కానీ వారు కలిసింది.. పిల్లల భవిష్యత్తు గురించట. వారికి ఏం చేద్దామనే ఆలోచనలో భాగంగానే ఇద్దరూ కలసి మాట్లాడుకున్నారు తప్ప.. తాము కలసిపోయేందుకు వారు మాట్లాడుకోలేదట. అందువల్ల ఈ వార్తల్లో నిజం లేదని.. అంతా అబద్దమేనని తేలింది.
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లు 2004లో వివాహం చేసుకోగా.. ఈ ఏడాది జనవరిలో తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపి షాకిచ్చారు. విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు. అందులో భాగంగానే వారు ఇప్పటికే విడాకులు కూడా తీసుకున్నారు. ఇక వారు కలిసే ప్రసక్తే లేదని వెల్లడించారు. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ తమ వంతు బాధ్యతలను తీసుకుంటామని మాత్రం చెప్పారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…