Anasuya : గత కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్న అనసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో అనసూయపై నెగిటివిటీ, ట్రోల్స్ అధికం కాగా అనసూయ తిరిగి పోరాటం చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు.
సాయి రవి 267 ఐడీతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ పోటోలు పెడుతున్నట్లుగా వెళ్లడయ్యింది. ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీర్రాజు మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సినీ పరిశ్రమలోని హీరోయిన్లు, యాంకర్స్ టార్గెట్ చేస్తూ వారి ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా దర్యాప్తులో వెళ్లడయ్యింది. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. అనసూయ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
వీర్రాజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు అభ్యకరమైన కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఇలానే సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్న మిగతవారు కూడా భయపడాలనే ఉద్దేశంతో తన అకౌంట్ లో వీర్రాజు ను అరెస్ట్ చేసిన విషయాన్ని షేర్ చేసానని అనసూయ పేర్కొన్నారు. మరీ ఈ అరెస్ట్ తో అయినా ఆమెను ట్రోల్ చేస్తున్నవారు భయపడతారని అనసూయ నమ్ముతున్నారు. మరి ఏ మేరకు అనసూయ విజయం సాధించారో వేచి చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…