Mokshagna : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ పేర్లే మొదటిగా గుర్తుకొస్తాయి. ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగ చైతన్య స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు.
అయితే గత కొంతకాలం నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కాని నందమూరి అభిమానులు కల మాత్రం నిజం కావడం లేదు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారని పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు ఆ వార్త పై స్పందించారు. గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు.
గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల అఖండ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి సందడి చేశారు. ఇక తన కుమారుడు మోక్షజ్ఞని వచ్చే ఏడాది టాలీవుడ్లోకి పరిచయం చేయనున్నట్లు బాలయ్య బాబు వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య బాబు ప్రస్తావించలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను హీరోగా పరిచయం చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలయ్య మాట్లాడుతూ.. అంతా దైవేచ్ఛ అని నవ్వి ఊరుకున్నారు. ఇలా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య బాబు క్లారిటీ ఇచ్చేశారు.
ఇక అనంతరం అఖండ-2 పై కూడా స్పందించారు. అఖండ-2 కచ్చితంగా ఉంటుంది. అఖండ-2 కావలసిన సబ్జెక్ట్ కూడా సిద్ధం. ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసిప్రకటిస్తాం అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…