కన్నవారికి, కుటుంబ సభ్యలకు ఏమైనా అయితే వారిని రక్షించుకునేందుకు తోటి కుటుంబ సభ్యులు ఏం చేసేందుకైనా వెనుకాడరు. ఆ బాలుడు కూడా అలాగే తన తోబుట్టువును రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఓ వైపు రోడ్డు పక్కన పక్షి ఆహారం అమ్ముతూనే మరో వైప తన చదువును కొనసాగిస్తున్నాడు.
హైదరాబాద్కు చెందిన 10 ఏళ్ల సయ్యద్ అజీజ్ అనే బాలుడి సోదరి సకీనా బేగం (12) క్యాన్సర్ బారిన పడింది. 2 ఏళ్ల కిందట ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసింది. కానీ ఆమెకు ఆ డబ్బులు చికిత్స కోసం ఖర్చయ్యాయి. దీంతో వారి పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ క్రమంలో వారు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక తన సోదరిని ఎలాగైనా రక్షించుకోవాలనే తాపత్రయంతో అజీజ్ రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రహదారి పక్కన పక్షి ఆహారం (బర్డ్ ఫుడ్) అమ్ముతున్నాడు. తరువాత అతను 8 గంటలకు మదర్సాకు వెళ్తాడు. అజీజ్ సంపాదించే డబ్బులు ఆమె మందులకు మాత్రమే సరిపోతున్నాయి. టెస్టులు చేయించేందుకు డబ్బులు సరిపోవడం లేదు. దీంతో అజీజ్ తల్లిదండ్రులు తమకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…