కూరగాయల అమ్ముకుంటున్న ప్రైవేట్ స్కూల్ యజమాని.. కారణం అదే..!

April 9, 2021 2:56 PM

గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రతి ఒక్క రంగంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా ధాటికి ఎంతోమంది ఉద్యోగాలు పోవడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. మరికొందరు వారికి దొరికిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ టీచర్లపై కూడా కరోనా ప్రభావం పడింది.

హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ బోలక్ పూర్ ప్రాంతానికి చెందిన సెయింట్ సాయి పాఠశాల యజమాని కరోనా కారణం వల్ల కూరగాయల వ్యాపారి గా మారారు. ఈ పాఠశాల యజమాని కూరగాయలను అమ్ముతూ త్వరలోనే పాఠశాలలో రీ ఓపెన్ చేయాలని రోడ్డుపై నిరసన తెలియజేశారు.

సెయింట్ సాయి పాఠశాల యాజమానితో పాటు, టీచర్లు కూడా సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ టీచర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్కూల్ యాజమాన్యం చేస్తున్న నిరసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment