చౌటుప్పల్లోని రాంనగర్ కాలనీలో ఓ తల్లి ఇటీవల తన ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాగుబోతు భర్తను భరించలేక ఆమె ఆ అఘాయిత్యానికి పాల్పడింది. అయితే ఆ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులను కూడా ఆ సంఘటన కలచి వేసింది. తొర్పునూరి వెంకటేశం అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతోనే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు ఉరి వేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఉమారాణి, హర్షిణి, లాస్యల మృతదేహాలకు గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశంను పోలీసులు అరెస్టు చేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అతన్ని అరెస్టు చేయవద్దని కుటుంబ సభ్యులు కోరగా ఆ కార్యక్రమం ముగిసే వరకు పోలీసులు వేచి చూశారు. తరువాత అతన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు.
కాగా ఉమారాణి మూడో కుమార్తె 3 ఏళ్ల శైనీని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు దుఃఖిస్తున్నారు. తన తల్లి, ఇద్దరు అక్కలకు ఏమైందో కూడా తనకు తెలియదు. ఫోన్లో వారి ఫొటోలను చూస్తూ వారు వస్తారేమోనని ఎదురు చూస్తోంది. తల్లి, అక్కలు ఎటు వెళ్లారని అడిగితే ఉయ్యాల ఊగి ఊరికి వెళ్లారని చెబుతోంది. మళ్లీ వారు వస్తారా అని అడిగితే వారు చనిపోయారుగా, ఇంక రారు.. అని అమాయకంగా శైనీ సమాధానం చెబుతోంది. దీంతో ఆమెను చూస్తున్న వారి గుండె తరుక్కుపోతోంది. ఆమె అమాయకత్వాన్ని చూసిన వారు కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…