చౌటుప్పల్లోని రాంనగర్ కాలనీలో ఓ తల్లి ఇటీవల తన ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాగుబోతు భర్తను భరించలేక ఆమె ఆ అఘాయిత్యానికి పాల్పడింది. అయితే ఆ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులను కూడా ఆ సంఘటన కలచి వేసింది. తొర్పునూరి వెంకటేశం అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతోనే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు ఉరి వేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఉమారాణి, హర్షిణి, లాస్యల మృతదేహాలకు గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశంను పోలీసులు అరెస్టు చేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అతన్ని అరెస్టు చేయవద్దని కుటుంబ సభ్యులు కోరగా ఆ కార్యక్రమం ముగిసే వరకు పోలీసులు వేచి చూశారు. తరువాత అతన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు.
కాగా ఉమారాణి మూడో కుమార్తె 3 ఏళ్ల శైనీని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు దుఃఖిస్తున్నారు. తన తల్లి, ఇద్దరు అక్కలకు ఏమైందో కూడా తనకు తెలియదు. ఫోన్లో వారి ఫొటోలను చూస్తూ వారు వస్తారేమోనని ఎదురు చూస్తోంది. తల్లి, అక్కలు ఎటు వెళ్లారని అడిగితే ఉయ్యాల ఊగి ఊరికి వెళ్లారని చెబుతోంది. మళ్లీ వారు వస్తారా అని అడిగితే వారు చనిపోయారుగా, ఇంక రారు.. అని అమాయకంగా శైనీ సమాధానం చెబుతోంది. దీంతో ఆమెను చూస్తున్న వారి గుండె తరుక్కుపోతోంది. ఆమె అమాయకత్వాన్ని చూసిన వారు కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…